Kishan Reddy : ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగితే ఒక్క భారతదేశంలోనే రేటు పెరగలేదని, కాంగ్రెస్ హయాంలో యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మెదక్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకి పసుపు బోర్డు వచ్చిందని, తెలంగాణలో ప్రధాని ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోపిడీ చేస్తే…ఇప్పుడు సోనియాగాంధీ కుటుంబం…
Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు కూడా తెలియజేశారు.
Bharat Jodo Vivah: భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా భారత్ జోడో వివాహం జరిగింది. భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది ఓ యువ జంట.
Union Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 19) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను అర్ధరాత్రి నియమించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు.
Congress: హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేసింది. సామాజిక న్యాయం అనే నినాదం కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర వేసింది.
Duddilla Sridhar Babu : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి , రాహుల్ గాంధీ కులం , మతం గురించి ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం, వారు రాహుల్ గాంధీ తల్లి ఒక క్రిస్టియన్, తండ్రీ ఒక ముస్లిం అయినందున ఆయన కులం ఏది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బీజేపీ…
Ajay Singh Yadav : జై బాపు, జై సంవిధాన్ ప్రోగ్రాం కోసం ఇక్కడికి వచ్చానని, సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారు.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్. ఇవాళ ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ.. కులగణన సిటీ స్కాన్ లాంటిదని, 46శాతం బీసీ లకు 10 శాతం WESకు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తోందన్నారు. కులగణన వలన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన…
Minister Seethakka: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం, కుల గణనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని.. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ…
TPCC Mahesh Goud : మహేశ్వరం గట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ క్రాంతి బూనియాది ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం యూత్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు టీపీసీసీ చీఫ్. మూడు రోజుల పాటు శిక్షణ శిబిర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..…