Rahul Gandhi: బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లింది… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు.
అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వెల్లడించారు. దేశం ప్రమాదం అంచున ఉందని… దేశంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ బాధ్యతాయుత్తంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు, సంఘాలు, రాష్ట్రాలు, మతాల మధ్య సామరస్యం తీసుకురావడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఆయన అన్నారు. ఇండియాలో పరిస్థితులు వేడెక్కి ఉన్నాయని… వాటిని చల్లబరచాల్సి ఉందని లేకపోతే పరిస్థితులు విషమిస్తాయని ఆయన అన్నారు.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కుతోందని… కాంగ్రెస్ మాత్రం ప్రజల వాయిస్ వింటుందని ఆయన అన్నారు. బీజేపీ కేకలు వేయడం గొంతులు నొక్కడం చేస్తుందని… కాంగ్రెస్ మాత్రం ప్రజల వాయిస్ వింటుందని దయచేసి దేశ ప్రజలు ఇది గుర్తించాలని కోరారు. ప్రధాని ప్రజల సమస్యలు వినాలనే ఆలోచన ఉండాలని… కానీ మా ప్రధాని వినరని విమర్శించారు రాహుల్ గాంధీ. నేను చాలా మంది బ్యూరోక్రాట్లతో మాట్లాడానని… ప్రస్తుతం వారంతా ఇండియా విదేశాంగ విధానం మారిందని అంటున్నారని… అహంకారం పెరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కు ఉన్న నిర్మాణం బీజేపీ పార్టీకి కలిసి వస్తోందని… కాంగ్రెస్ కూడా అలాంటి వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!