Rahul Gandhi: బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లింది… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు.
అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వెల్లడించారు. దేశం ప్రమాదం అంచున ఉందని… దేశంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ బాధ్యతాయుత్తంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు, సంఘాలు, రాష్ట్రాలు, మతాల మధ్య సామరస్యం తీసుకురావడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఆయన అన్నారు. ఇండియాలో పరిస్థితులు వేడెక్కి ఉన్నాయని… వాటిని చల్లబరచాల్సి ఉందని లేకపోతే పరిస్థితులు విషమిస్తాయని ఆయన అన్నారు.
Also Read
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కుతోందని… కాంగ్రెస్ మాత్రం ప్రజల వాయిస్ వింటుందని ఆయన అన్నారు. బీజేపీ కేకలు వేయడం గొంతులు నొక్కడం చేస్తుందని… కాంగ్రెస్ మాత్రం ప్రజల వాయిస్ వింటుందని దయచేసి దేశ ప్రజలు ఇది గుర్తించాలని కోరారు. ప్రధాని ప్రజల సమస్యలు వినాలనే ఆలోచన ఉండాలని… కానీ మా ప్రధాని వినరని విమర్శించారు రాహుల్ గాంధీ. నేను చాలా మంది బ్యూరోక్రాట్లతో మాట్లాడానని… ప్రస్తుతం వారంతా ఇండియా విదేశాంగ విధానం మారిందని అంటున్నారని… అహంకారం పెరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కు ఉన్న నిర్మాణం బీజేపీ పార్టీకి కలిసి వస్తోందని… కాంగ్రెస్ కూడా అలాంటి వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!