Rahul : రాహుల్ చెప్పాక కూడా కాంగ్రెస్ నాయకుల మధ్య అదే గ్యాప్ నడుస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ను సీరియస్గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా.. అందుబాటులో ఉన్న నాయకులు కూడా మీటింగ్కు వెళ్లకుండా హ్యాండిచ్చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్లో కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని జగ్గారెడ్డితోపాటు మరికొందరు అలక వహించారట. దీంతో సమీక్షకే వెళ్లని నాయకులు రేపటి రోజున ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తారా అనే అనుమానాలు ఉన్నాయట.
ఈ నెల 21 నుంచి జనంలోకి వెళ్లేందుకు రైతు డిక్లరేషన్ పై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ ఏం చేస్తుంది… ఏం చేసింది అనే అంశాలపై రచ్చబండ దగ్గర చర్చ చేస్తారు. పీసీసీ షెడ్యూల్ కంటే ముందే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో టూర్ షెడ్యూల్ ప్రకటన చేశారు. పార్టీ డిక్లరేషన్ని సీరియస్గా తీసుకోకుంటే.. జిల్లాల వారీగా ఉండే పంచాయితీలు కూడా రచ్చబండకు అడ్డంకి అవుతాయనే చర్చ జరుగుతోంది. రాహుల్ పర్యటన తర్వాత కొంతమంది నాయకులు బయటకు మాట్లాడలేక.. ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా ఏం చేస్తారన్నది చర్చ. కొందరు డీసీసీ అధ్యక్షులు ఇప్పటికే పీసీసీపై అసంతృప్తితో ఉన్నారు. వీటన్నింటినీ ఎలా సమన్వయం చేస్తారు? నాయకులను ఒకచోటకు తీసుకొచ్చేది ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
వాస్తవానికి తెలంగాణలో రాహుల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ నాయకులు విభేదాలను పక్కనపెట్టి ఐక్యతగా వెళ్తారని అనుకున్నారు. కానీ.. నేతల మధ్య గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే రచ్చబండపై ఎవరూ ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. రైతు డిక్లరేషన్ సాఫీగా సాగితే ఎలాంటి గొడవ ఉండదు. కానీ.. రచ్చబండ రచ్చ రచ్చ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందని గాంధీభవన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట. మరి..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!