Rahul : రాహుల్ చెప్పాక కూడా కాంగ్రెస్ నాయకుల మధ్య అదే గ్యాప్ నడుస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ను సీరియస్గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా.. అందుబాటులో ఉన్న నాయకులు కూడా మీటింగ్కు వెళ్లకుండా హ్యాండిచ్చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్లో కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని జగ్గారెడ్డితోపాటు మరికొందరు అలక వహించారట. దీంతో సమీక్షకే వెళ్లని నాయకులు రేపటి రోజున ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తారా అనే అనుమానాలు ఉన్నాయట.
ఈ నెల 21 నుంచి జనంలోకి వెళ్లేందుకు రైతు డిక్లరేషన్ పై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ ఏం చేస్తుంది… ఏం చేసింది అనే అంశాలపై రచ్చబండ దగ్గర చర్చ చేస్తారు. పీసీసీ షెడ్యూల్ కంటే ముందే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో టూర్ షెడ్యూల్ ప్రకటన చేశారు. పార్టీ డిక్లరేషన్ని సీరియస్గా తీసుకోకుంటే.. జిల్లాల వారీగా ఉండే పంచాయితీలు కూడా రచ్చబండకు అడ్డంకి అవుతాయనే చర్చ జరుగుతోంది. రాహుల్ పర్యటన తర్వాత కొంతమంది నాయకులు బయటకు మాట్లాడలేక.. ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా ఏం చేస్తారన్నది చర్చ. కొందరు డీసీసీ అధ్యక్షులు ఇప్పటికే పీసీసీపై అసంతృప్తితో ఉన్నారు. వీటన్నింటినీ ఎలా సమన్వయం చేస్తారు? నాయకులను ఒకచోటకు తీసుకొచ్చేది ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
వాస్తవానికి తెలంగాణలో రాహుల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ నాయకులు విభేదాలను పక్కనపెట్టి ఐక్యతగా వెళ్తారని అనుకున్నారు. కానీ.. నేతల మధ్య గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే రచ్చబండపై ఎవరూ ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. రైతు డిక్లరేషన్ సాఫీగా సాగితే ఎలాంటి గొడవ ఉండదు. కానీ.. రచ్చబండ రచ్చ రచ్చ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందని గాంధీభవన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట. మరి..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!