Bharat Jodo Yatra: తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. రాత్రి బోయిన్ పల్లిలో బసచేసిన రాహుల్ గాంధీ పాదయాత్రను హుషారుగా ప్రారంభించారు.
దేశాన్ని మళ్లీ ఏకం చేసేందుకు తెలంగాణలో భారత్ జోడో యాత్రతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కలిసి సంఘీభావం తెలిపారు.
నేడు హైదరాబాద్లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ సిటీలోకి ప్రవేశించింది.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టొచ్చు.. అంతేకాదు చైనాలో కూడా పోటీ చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్.. అమెరికా, చైనాలోనూ పోటీ చేసుకొవచ్చని.. కానీ, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు