Raghuram Rajan: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghuram Rajan Joins Rahul Gandhi During Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో ఐక్యత పెంపొందించే లక్ష్యంతో, పార్టీకి పూర్వవైభవాన్ని తేవాలని ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. రాహుల్ గాంధీ గత మూడు నెలల నుంచి పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రెటీలు, బాలీవుడ్ నటులు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం రాజస్థాన్ లో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. బుధవారం ఉదయం సవాయ్ మాధోపూర్ నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అయిన తర్వాత రఘురాం రాజన్, రాహుల్ గాంధీతో కలిసి చర్చిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియోను కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్కు కోర్టు సమన్లు.. హాజరు కావాలంటూ ఆదేశాలు
Also Read
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
ఇప్పటికే ప్రముఖ ఉద్యమకారిణి మేధా పాట్కర్, కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన నామ్ దేవ్ దాస్ త్యాగి, నటి స్వరా భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ వంటి వారు రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. మొత్తం 3570 కిలోమీటర్లు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో సాగుతోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్ భారత్ జోడో యాత్ర ముగియనుంది.
#BharatJodoYatra में @RahulGandhi जी के साथ कदम मिलाते RBI के पूर्व गवर्नर श्री रघुराम राजन…
नफ़रत के खिलाफ देश जोड़ने के लिए खड़े होने वालों की बढ़ती संख्या बताती है कि- हम होंगे कामयाब। pic.twitter.com/MFV6izCpcw
— Congress (@INCIndia) December 14, 2022
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!