Bhagwant Mann: కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉంది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann criticized Congress is in a coma: గుజరాత్ ఎన్నికల్లో ఓటమి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిందిస్తూ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అయితే ఈ వ్యాఖ్యలపై ఆప్ పార్టీ భగ్గుమంటోంది. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఆప్ పార్టీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాహుల్ గాంధీ గుజరాత్ లో ఎన్నిసార్లు పర్యటించారు..? ప్రశ్నించారు. కేవలం ఒకేసారి పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు భగవంత్ మాన్. సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికలు జరిగాయని.. రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ సూర్యుడు ఉదయించే కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిందని.. ముందు రాహుల్ గాంధీ టైమింగ్ సరిచేసుకోనివ్వండి అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Leopard At Hetero Update : చిరుతకోసం అన్వేషణ.. 11 గంటలుగా అధికారుల హైరానా
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీల్లోకి చేరుతున్నారని.. పార్టీ చాలా పేవలంగా మారిందని.. ప్రత్యర్థి పార్టీకి సంఖ్యాబలం లేనప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి వారికి తమ ఎమ్మెల్యేలను అమ్మేస్తోందని భగవంత్ మాన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని.. ఆ తరువాత అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
ఆప్ లేకపోతే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీని ఓడించే వాళ్లం అని నిన్న రాజస్థాన్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆప్, బీజేపీకి బీ-టీమ్ గా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ, ఆప్ ను వినియోగిస్తోందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆప్ ఘాటుగానే స్పందించింది. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఆప్ బోణీ చేసింది. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 156 స్థానాల్లో గెలిచి బీజేపీ రికార్డ్ సృష్టించింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల్లో గెలపొందగా.. ఆప్ 5 స్థానాల్లో గెలిచింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!