కొత్త కెబినెట్ కొలువు తీరాక ఏపీ సెక్రటేరియెట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ అధికారి ఎలా ఉంటారు? గతంలో ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉంటున్నారనేది ఆ చర్చ సారాంశం. మాజీ మంత్రులు.. కొత్త మంత్రులు కలిస్తే మాత్రం కచ్చితంగా అధికారుల తీరు ప్రస్తావనకు వస్తోందట. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై ఆసక్తిగా చర్చ సాగుతున్నట్టు సమాచారం. అధికారుల తీరు వల్ల ఎదురైన ఇబ్బందులను.. కొత్త అమాత్యులతో పంచుకుంటూ.. ఆ ఆఫీసర్తో జాగ్రత్త.. ఈ అధికారిని…
వెలంపల్లి శ్రీనివాస్. తాజా మాజీ మంత్రి. పదకొండు మందికి కేబినెట్లో తిరిగి చోటు దక్కినా.. ఆ జాబితాలో తాను లేకుండా పోయానని కొత్తలో కొంత బాధపడ్డారట వెలంపల్లి. ఇప్పుడా బాధ నెమ్మదిగా పోతున్నట్టే ఉంది. రోజువారీ కార్యక్రమాలు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ టూర్ వేస్తూ.. మళ్లీ గెలుపొందే ప్రయత్నాలు చేస్తున్నారట. మినిస్టర్ పోస్ట్ పోయినా.. హ్యాపీగా ఉండటానికి చాలా కారణాలు చెబుతున్నారు ఆయన అనుచరులు. గతంలో ఆయన చేపట్టిన మంత్రి పదవి వల్ల నియోజకవర్గంలో…
అనంతపురం జిల్లా రాజకీయాల్లో తరచూ హైటెన్షన్ ఏర్పడే నియోజకవర్గాల్లో ఉరవకొండ కూడా ఒకటి. అదేదో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వార్తోనే కాదు. అధికార వైసీపీలో ఉన్న గ్రూపులతోనే తరచూ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటాయి. కానీ ఈసారి సీన్ మారింది. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య పెద్ద వార్కు దారితీసింది. కాకపోతే ఇక్కడ ఫ్లెక్సీలు కట్టింది వైసీపీ నేతలు. ఆ…
ఏపీలో అధికారపార్టీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ప్రభుత్వపరంగా, పార్టీ రీత్యా అంతా సెట్ చేస్తున్నరు అధినేత. ఇప్పటి నుంచే నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లాలని.. ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కు శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు కృష్ణదాస్కు భారంగా మారబోతున్నట్టు టాక్. సౌమ్యుడిగా పేరున్న ఆయన గ్రూపుల గోలను ఏ విధంగా సెట్ చేస్తారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి…
తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విభజన లో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. విద్యార్ధుల ప్రాణాలు కోల్పోవద్దు అని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేము. రాహుల్ గాంధీ నీ ఉస్మానియా యూనివర్సిటీ కి తీసుకువస్తాం. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీ వెళ్తారు. యూనివర్సిటీ సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడతారు. యూనివర్సిటీ సమస్యలు..ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారు. సమస్యలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చే…
వైవీ సుబ్బారెడ్డి రాకతో కలిగే ప్రయోజనాలపై చర్చ.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వే విశాఖపట్నం. ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువుపట్టు. ఇక్కడ ఫలితాలు పార్టీల పటిష్టత, భవిష్యత్ను నిర్ధేశిస్తాయి. అందుకే అందరి దృష్టీ ఎప్పుడూ విశాఖపై ఉంటుంది. వచ్చే రెండేళ్లూ ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఫోకస్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ సంస్థాగతంగా కీలకమైన మార్పులు చేసింది. ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయకర్త బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలపై పెట్టింది అధికార పార్టీ. కొత్త బాస్రాకతో…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియామకమై రెండేళ్లు అవుతుంది. రాష్ట్ర కమిటీ ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది. అయినప్పటికీ బీజేపీలో వివిధ స్థాయిలో పార్టీ పోస్ట్లు ఖాళీగానే ఉన్నాయి. వివిధ కారణాలతో వాటి భర్తీని ఆపేశారు. ఎప్పటి నుంచో పదవులు కట్టబెట్టాలని నేతలు డిమాండ్ చేస్తున్నా.. సీనియర్లు సూచిస్తున్నా.. ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆ పదవుల్లో కీలకమైన అసెంబ్లీ కన్వీనర్ పోస్టులు కూడా ఉన్నాయి. ..spot.. gfx కన్వీనర్ పోస్టులపై ఉలుకు..…
కర్నూలు జిల్లా ఆదోని ఒకప్పుడు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ప్రస్తుతం ఆదోని టీడీపీ ఇంచార్జ్గా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 వార్డులకు గాను.. టీడీపీకి దక్కింది ఒక్క వార్డే. 5 గ్రామ పంచాయతీలలోనే టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. రెండు ఎంపీటీసీలు దక్కాయి. పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయినా పార్టీ నేతలు వర్గపోరును విడిచిపెట్టడం లేదు. ఆదోనిలో టీడీపీ పరాజయానికి..…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కత్తి పట్టుకుని కూర్చున్నారు. 32 జిల్లాల్లో పార్టీ నాయకత్వం పై భారీగానే మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా కొందరికి కోత పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చేదంతా ఎన్నికల సీజన్ కావడంతో.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేస్థాయి నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికే డీసీసీ పదవులు కట్టబెటడతారని తెలుస్తోంది. ..spot.. జిల్లాలో బలమైన నాయకుడు అనే ముద్ర ఉండటంతోపాటు..…
ఇప్పటికే చాలా జండాలు మారాయి..చాలా కండువాలు కప్పారు.. తీసేశారు..కొంత కాలంగా ఇవన్నీ కాదని సైలెంట్ గా ఉన్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేదదీరుదామనుకుంటున్నారట..హస్తం, సైకిల్, కమలం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన ఆయన వైసీపీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట.. మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారా? కీలక నేత దారెటు? సి కే జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుల్లో ఒకరైన సికె బాబు, నాలుగు సార్లు…