టీడీపీకి మిగిలింది ఆ నలుగురే..ఎటూ వెళ్లలేక తికమక | Mahbubnagar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసుపు కండువా నీడలోనే నేతలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశంపార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం ముగ్గురు నలుగురే ఉన్నారు. వారిలో ఒకరు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. మిగతా వాళ్లు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి.. కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. వీళ్లు మాత్రం పసుపు కండువా నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. బక్కని నర్సింహులు టీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండటంతో.. ఆయన్ని మినహాయిస్తే మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయం వాడీవేడీగా ఉండటంతో ప్రస్తుతం చర్చ వీరిపై మళ్లింది. ఆరోగ్య కారణాలతో రావుల యాక్టివ్గా లేరు. కొత్తకోట దంపతులు మాత్రం ఒక జాతీయ పార్టీలో చేరతారని కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ కండువా కప్పుకొంటారో.. బీజేపీ పంచన చేరతారో పాలమూరు టీడీపీ నేతలు స్పష్టత ఇవ్వడం లేదు. దయాకర్రెడ్డికి మాత్రం టీఆర్ఎస్వైపు మనసు లాగుతున్నట్టు సమాచారం. కానీ.. కొత్తకోట దంపతుల నియోజకవర్గాలైన మక్తల్, దేవరకద్రలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని కాదని ఈ దంపతులకు టీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వకపోవచ్చని అనుచరులు లెక్కలేస్తున్నారట. అందుకే కాంగ్రెస్, బీజేపీలను ఒక ఆప్షన్గా పెట్టుకున్నారని చెబుతున్నారు. పైగా వచ్చే ఎన్నికలు జిల్లాలో మిగిలిన టీడీపీ నేతలకు అగ్ని పరీక్షే. సరైన దిశగా అడుగులు వేయకపోతే రాజకీయంగా వారి భవిష్యత్ ఇబ్బందుల్లో పడ్డట్టే. ఆ విషయం తెలిసినా మౌనంగా ఉండిపోతున్నారు నాయకులు.
Also Read
అనుచరులు ఒత్తిడి తెస్తున్నా.. అదే పనిగా ప్రశ్నిస్తున్నా.. స్పష్టత ఇవ్వడం లేదు టీడీపీ నేతలు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆలోచిస్తున్నారో లేక.. చేరాలని అనుకుంటున్న పార్టీల్లో సీట్లపై స్పష్టత లేక వేచి చూస్తున్నారో బయటపెట్టడం లేదు. కొత్తకోట దంపతులను చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే వారు అడిగే రెండు సీట్ల విషయంలోనే ఆ పార్టీలు వెనక్కి తగ్గుతున్నాయట. అందుకే రాజకీయంగా ముందడుగు పడటం లేదని సమాచారం.
ఒక తరం మారిపోయిందని అనుచరుల హెచ్చరిక తమ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులే ఇప్పటికే కొనసాగుతున్నాయనే లెక్కలను తప్పుపడుతున్నారట అనుచరులు. మారిన రాజకీయ పరిణామాలతో ఒక తరం మారిపోయిందనే అంశాన్ని విస్మరించొద్దని హెచ్చరిస్తున్నారట. ఈ సత్యాన్ని గుర్తించి నిర్ణయం తీసుకుంటే పొలిటికల్ కెరీర్ ట్రాక్లో పడుతుందని.. లేకపోతే ఇక్కడితే ఫుల్స్టాప్ పడిపోతుందని హితవు పలుకుతున్నారట. మక్తల్, దేవరకద్రలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇక రావుల మనసు మార్చుకుంటారో లేదో అనుచరులకు తెలియడం లేదట. ఇక బక్కని పరిస్థితి మరో ఎల్ రమణలా అవుతుందా లేక టీ టీడీపీలో ఏక్ నిరంజన్గా మిగిలిపోతారో చూడాలి.
- Tags
- Mahbubnagar
- palamuru
- Politics
- tdp
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!