ధర్మాన కృష్ణదాస్ కు ఆ పదవి కత్తిమీద సామే..అది పెద్ద సవాలేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అధికారపార్టీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ప్రభుత్వపరంగా, పార్టీ రీత్యా అంతా సెట్ చేస్తున్నరు అధినేత. ఇప్పటి నుంచే నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లాలని.. ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కు శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు కృష్ణదాస్కు భారంగా మారబోతున్నట్టు టాక్. సౌమ్యుడిగా పేరున్న ఆయన గ్రూపుల గోలను ఏ విధంగా సెట్ చేస్తారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో వైసీపీకి ఇంటిపోరు తప్పడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తలు పూర్తి నిరుత్సాహంతో ఉన్నారట. వారిని కృష్ణదాస్ ఎలా చైతన్యం చేస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మూడు గ్రూపులు.. ఆరు కూటమూల చందంగా ఉంది. ఎక్కడ చూసినా లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు అన్ని చోట్లా గ్రూపుల గోలే. అసంతృప్తులు ఎక్కువయ్యారు. వారందరినీ కృష్ణదాస్ ఎలా బుజ్జగిస్తారన్నది పెద్ద సందేహం. ఇచ్ఛాపురంలో నేతలు ఎక్కువ.. కేడర్ తక్కువ. జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ కుటుంబానికి వ్యతిరేకంగా అక్కడ పావులు కదుపుతోంది ఒక వర్గం. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. మున్సిపాలిటీలో వైసీపీ నేతల వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది. టెక్కలి వైసీపీలో షరా మామూలే. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, కిల్లి కృపారాణిలు మధ్య మూడు ముక్కలాటలా మారింది. ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వర్సెస్ యాంటీ గ్రూప్ అన్నట్టుగా ఉంది. ఎచ్చెర్లలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ద్వితీయశ్రేణి నేతలు ప్రెస్మీట్స్ పెడుతున్నారు.
Also Read
ఈ గొడవల్లో కొన్ని వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. కానీ.. సమస్య పరిష్కారం కాలేదు. ఎవరికి వారు గ్రూపులు కట్టి అవకాశం దొరికితే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. 2019లో జగన్ మేనియాలో గ్రూపుల ఎఫెక్ట్ పెద్దగా పనిచేయలేదు. కానీ.. ఈసారి అన్నీ లెక్కల్లోకి వస్తాయి. వాటిని సరిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. సిక్కోలు జిల్లాలో టీడీపీకి బలగం ఉంది. వారిని ఎదుర్కోవాలంటే వైసీపీ నేతలు కలిసి సాగక తప్పదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు.. ఇంత వరకు ఉప్పు నిప్పులా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావులు కృష్ణదాస్కు ఎంత వరకు సహకరిస్తారన్నది పార్టీలో చర్చ.
ధర్మాన కృష్ణదాస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతా సమానమేనని.. మంత్రి.. కార్యకర్త ఒకటేనని అంటూనే పార్టీ లైన్లో లేనివారు ఎవరైనా కొరడా ఝులిపించాలని సూచించారు. మరి.. ఇన్ని సవాళ్ల మధ్య వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
Watch Here : https://youtu.be/0s1Hei0jWko
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!