సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు.…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ గత సంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని…
ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి…
మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబ తాటాకు తప్పుళ్ళకు భయపడమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నాడని, ఫాంహౌస్ లో కూర్చుని కేసీఆర్ కంటోన్న కలలు కల్లలుగా మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు.. దేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని కేసీఆర్ పొగుడుతాడని ఎవరు అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వ…
మూడేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ఏపీని వల్లకాడు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. తమ బాధలను చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కి పెట్టారని విమర్శించారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. చాలాచోట్ల కొందరు హత్యలకు గురయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్నారు. 4 వేల మంది టీడీపీ వారిపై కేసులు…
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్కు అంత నమ్మకమేంటని ప్రశ్నించారు. నిజంగా అంత నమ్మకం ఉంటే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. తక్షణమే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. జరభద్రం అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారని.. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావిస్తామని.. నాయకుడు మారాడని చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్ధుల లక్ష్యం నెరవేరినట్లేనని పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. YSRCP: సీఎం జగన్ సీరియస్.. జీరో పెర్ఫార్మెన్స్తో ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పదో తరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదో తరగతి ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులంటే అభిమానం చూపిస్తున్నారని.. వాళ్లను చూస్తే ఆయనకు స్వజాతి పక్షులం అన్న ఫీలింగ్ కలుగుతుందేమో అంటూ చురకలు అంటించారు. చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. పదో తరగతి…
ఇటీవల మహ్మద్ ప్రవక్త మీద నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాల్లో ఆగ్రహావేశాలు రగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆలోచన.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలు రోజుకొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడు. కర్నాటకలో ఈశ్వరప్ప జాతీయ…
పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మాజీ మంత్రి దేవినేని ఉమ ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ పార్టీ పరంగా వివాదాస్పదం కావడంతో దేవినేని ఉమా వెంటనే దానిని డిలీట్ చేశారు. అయితే ఈ విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు పసిగట్టేశారు.…