MP K Lakshman : తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి ఆయన ఆరోపించారు.
ఎంబీసీలను కేసీఆర్ చులకనగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని, తెలంగాణలో నిధులు లేక కార్పొరేషన్లు మూగబోయాయని ఆయన వ్యాఖ్యానించారు. యూపీలో 22మంది బీసీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, రాష్ట్రంలో 54శాతం ఉన్న ఓబీసీలకు కేవలం మూడే మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చారన్నారు. ఇదే కేసీఆర్ సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు.
Also Read
ఎంబీసీ వర్గాలకు బీజేపీ అండగా ఉంది.. రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ఫెడరేషన్లు వేసి నిధులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రంలో బొంగరం తిప్పుతానంటున్నారని, భారత్ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెడతానంటున్నారని, కేసీఆర్ రాచారిక,కుటుంబ పాలనను ఎంబీసీలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?