Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయనకు కనీస చికిత్స కూడా పాక్ ప్రభుత్వం అందించడం లేదనే ఆరోపణ వస్తున్నాయి. మాజీ పాక్ కెప్టెన్ తన కుడి కంటిచూపును 80 శాతం కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. దీంతో ఈ కేసులో ఏసీబీ (ACB) తదుపరి చార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. Sukesh Chandrasekhar: హెలికాప్టర్ కొనిస్తా ఐ లవ్…
Vande Mataram: కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వందేమాతరంను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులను హరించే ప్రయత్నమని కూడా వ్యాఖ్యానించారు. Pakistan-US: పాక్…
YS Jagan: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 4) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపడుతున్నారు. జగన్ రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాకు బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అంబటి…
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ కార్యాలయం నుండి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు…
తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ ఆయన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని…
KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ప్రభుత్వం నడపడం ఈ “సన్నాసుల” వల్ల కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చాటిచెప్పారు. పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జల వివాదాల విషయంలో రాజకీయ లబ్ధి కంటే రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. “తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా నన్ను అడిగితే..…
Shashi Tharoor: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్లో అసంతృప్తిని పెంచుతోంది.
Off The Record : పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను ఆ మంత్రిగారు బాగా… ఒంటబట్టించుకున్నారా. అందుకే ఏళ్ళ తరబడి టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని… పదవుల పందేరంలో జంపింగ్ జపాంగ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారా? చివరికి సొంత నియోజకవర్గంలో సొంత కేడరే ఆమె కార్యక్రమాన్ని బహిష్కరిస్తోందా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లో అంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఆ మినిస్టర్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సొంత…