భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక ప్రకటన చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోచింగ్, పెర్ఫార్మెన్స్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. భారత క్రికెట్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో అనుభవజ్ఞులైన నిపుణులను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం నాలుగు విభాగాల్లో బీసీసీఐ ఖాళీలను భర్తీ చేయనుంది. బ్యాటింగ్ కోచ్ విభాగంలో రెండు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. బ్యాట్స్మెన్ టెక్నిక్, ఫామ్, మ్యాచ్ సిచ్యువేషన్లలో ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యతలు గల వారు ఈ పోస్టుకు అర్హులు.
ఫాస్ట్ బౌలింగ్ కోచ్ విభాగంలో మూడు పోస్టులకు దరఖాస్తులు బీసీసీఐ అధికారులు స్వీకరిస్తున్నారు. యువ పేసర్లను గుర్తించడం, వారి వేగం, ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కీలకం. ఫీల్డింగ్ విభాగంలో మొత్తం నాలుగు కోచ్ పోస్టులను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో మూడు పురుషులకు, ఒకటి మహిళలకు కేటాయించారు. ఆధునిక క్రికెట్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ స్టాండర్డ్స్ను మెరుగుపరచడం, ఆటగాళ్ల అథ్లెటిసిజం పెంపొందించడం ఫీల్డింగ్ కోచ్ ప్రధాన లక్ష్యం. పెర్ఫార్మెన్స్ అనలిస్ట్గా ఒక పోస్టు ఖాళీగా ఉంది. మ్యాచ్ డేటా, ఆటగాళ్ల ప్రదర్శన విశ్లేషణ, వ్యూహాత్మక సూచనలతో జట్టు సిద్ధతకు సహకరించడం వీరి ప్రత్యేకత.
Also Read: Apple Watch లవర్స్కు పండగే.. ఏకంగా 10% ఫ్లాట్ డిస్కౌంట్.! భయ్యా.. ఈ డీల్ను అస్సలు మిస్సవ్వకండి.!
ఈ పోస్టులకు అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పని చేసే అవకాశం ద్వారా భారత క్రికెట్ భవిష్యత్తును మలిచే కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని బోర్డు పేర్కొంది. కోచింగ్ రంగంలో కొత్త సవాళ్లు ఎదుర్కొనాలనుకునే నిపుణులకు ఇది అరుదైన అవకాశం అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.