KTR : రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు కూలగొట్టే వ్యక్తి..
- కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు విమర్శలు
- ‘హైడ్రా’ అడుగులకు ప్రశ్నలే ప్రశ్నలు
- హామీల అమలుపై నిలదీత
- విద్యార్థుల నిరుద్యోగంపై స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ప్రభుత్వం నడపడం ఈ “సన్నాసుల” వల్ల కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ మంత్రులైన వివేక్ వెంకటస్వామి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, , పట్నం మహేందర్ రెడ్డిలకు చెందిన అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పేదవాడి ఇళ్లను కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లకు వచ్చేసరికి వెనకాడుతున్నారని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి” అంటూ ఆయన విమర్శించారు.
Also Read
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
- Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం కట్టిస్తామన్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ ఎక్కడ ఉన్నాయని కేటీఆర్ నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టినట్లు చూపించినా తాము సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలను మోసం చేయడమే తప్ప మరేమీ సాధించలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన దృష్టిని పాలనపై కేంద్రీకరించాలని సూచించారు. “పదేళ్లు పందిలా బతకాల్సిన అవసరం లేదు.. గౌరవంగా బతకాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అశోక్ నగర్ , దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో విద్యార్థులు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్లిన ముఖ్యమంత్రి, పక్కనే ఉన్న అశోక్ నగర్కు వెళ్లి నిరుద్యోగులతో కలిసి టీ తాగి, వారి సమస్యలను విని ఉంటే బాగుండేదని హితవు పలికారు. విద్యార్థులను పిలిపించుకుని మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న ఎమ్మెల్యేల తీరును కేటీఆర్ విమర్శించారు. పదిమంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారో, ఏ లింగమో వాళ్లకే తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రకాష్ గౌడ్ వంటి నేతలు పార్టీ మారుతున్నా, రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఎవరూ ఆపలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.
Virat Kohli History: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. వన్డేల్లో ఎప్పటికీ చెరగని ముద్ర!
తాజావార్తలు
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!