CM Revanth Reddy : వివాదాలకంటే పరిష్కారాలే మాకు అవసరం
- వివాదాలకంటే పరిష్కారాలే మాకు అవసరం
- చంద్రబాబుకు రేవంత్ బహిరంగ విజ్ఞప్తి
- జల సమస్యలపై రాజకీయాలకు స్థానమేమీ లేదు
- రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చాటిచెప్పారు. పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జల వివాదాల విషయంలో రాజకీయ లబ్ధి కంటే రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. “తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా నన్ను అడిగితే.. నేను నిస్సందేహంగా నీళ్లే కావాలని కోరుకుంటాను. మాకు వివాదాలు వద్దు.. పరిష్కారాలే కావాలి” అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read
- NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
- Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వేదికగా ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి ఉన్న ప్రాజెక్టుల అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని ఆయన కోరారు. “ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. దీనివల్ల రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. మేము ఏపీతో వివాదాన్ని కోరుకోవడం లేదు, కేవలం పరిష్కారం మాత్రమే కోరుకుంటున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ భూపరివేష్టిత (Landlocked) రాష్ట్రం కావడంతో, అభివృద్ధి కోసం పొరుగు రాష్ట్రాల సహకారం అనివార్యమని సీఎం గుర్తు చేశారు. “తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు లేదా మహారాష్ట్ర అయినా.. మేము అందరితో పరస్పర సహకారమే కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు సామరస్యంగా చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి” అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టడం తమకు ఇష్టం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీతో చర్చల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని, కేవలం ప్రజల మరియు రైతుల బాగు కోసమే తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని భరోసా ఇచ్చారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!