ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
తమకు పెళ్లి జరిపించాలని వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు అనుకోని షాకిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లో గురువారం ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమికుడినే పెళ్లి చేసుకుంటానంటూ దరఖాస్తు ఇచ్చింది. అయితే.. ఇంతలో అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమ బిడ్డను కావాలని తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు అమ్మాయిని తల్లికి అప్పగించారు. కాగా.. ప్రేమికుడిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు.
Haryana : హర్యానాలోని నుహ్లోని తవాడ సమీపంలోని మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగాయి.
Gujarat : గుజరాత్లోని వడోదరకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు యువకులు కుక్కను భవనంపై నుండి క్రిందికి విసిరివేస్తున్నారు.
Sexual Harassment: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ నెలకొంది. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్పరిణామాలకు భయపడేలా చేసి అమాయకుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పెట్రోల్ పంప్ వర్కర్పై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని కుమారుడు అనాస్లను అరెస్ట్ చేసేందుకు నోయిడా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా నోయిడా పోలీసులు అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకోగా.. అతను ఇంట్లో కనిపించలేదు.
అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత నెలకొని ఉంది. Also Read: Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు ఈ నేపథ్యంలో మాచర్లలో…