పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆది నారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో సంఘటన స్థలానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎమ్మెల్యే అభ్యర్థి కృపా లక్ష్మి చేరుకున్నారు. మన దళిత జాతికి మనమే సైనికుల నిలబడదం.., ఒక్కొక్క నా కొడుకుని ఏమి చేయాలో అది చేద్దాం మనకు ఎవరు వద్దు.., చిత్తూరు జిల్లా ఎస్పీ పనిచేయడానికి వచ్చాడా లేక చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడో తెలియదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. Also Read:…
తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గుర పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. లివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే అరెస్ట్ చేయకపోతే చంద్రగిరిని దిగ్భందిస్తామని పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది.
కడప జిల్లా జమ్మల మడుగులో నిన్న ( సోమవారం ) వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి చేసుకున్నారు. నేడు మళ్ళీ తిరిగి కవ్వింపు చర్యలకు వైసీపీ, టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచే సిన స్ట్రాంగ్ రూములను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది.. జీరో వైలెన్స్ గా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అచ్చంపేట మండలం వేల్పూర్ లో మరోసారి వివాదం చెలరేగుతుంది. నిన్న ( సోమవారం ) పోలింగ్ బూత్ దగ్గర గ్రామంలోని రెండు వర్గాల వారికి గొడవ జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. 26వ పోలింగ్ బూత్ లో తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణతో వివాదం చేలరేగింది.