సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే, వేములలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు
RBI Receives Bomb Threat: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన బెదిరింపుల్లో బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు.
Bomb Threat In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. పశ్చిమ విహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్లోని సల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు విద్యాసంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 13) తెల్లవారుజామున బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Lagacherla : రైతు ఈర్యా నాయక్కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమిచ్చినట్లు విచారణ తేలింది. జైలు రికార్డులో ఈర్యా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది పేర్కొన్నారు. దీని వెనుక కూడా రాజకీయ కుట్ర…
KTR: లగచర్ల ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులు పూర్తి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ నంది నగర్ లోని తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్లో హెల్మెట్ల తప్పనిసరిగా ధరించటాన్ని పోలీసులు అమలు చేయకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవటంలేదని.. అసలు పట్టించుకోవడంలేదన్నారు న్యాయమూర్తి.. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 667 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లోని బీచ్ రోడ్లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్గా పోలీసులు గుర్తించారు.
విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది హనీ ట్రాప్ కేసు.. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు.. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ముంబైలోని కుర్లాలో ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు.