Hyderabad: ఈ నెల 29న ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్..
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొనగా.. ఈనెల 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గణేష్ నిమజ్జనం కారణంగా బందోబస్తు ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెడీ అయింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఐటీసీ కాకతీయ హోటల్ లో కివీస్ జట్టు ఉండగా.. ఇక పాకిస్థాన్ జట్టు సైతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి పార్క్ హయత్ కు చేరుకుంది. తాజ్ కృష్ణలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్.. శంషాబాద్ నోవొటెల్ హోటల్ లో శ్రీలంక జట్టు ఉండనుంది.
Read Also: Russia: నార్డ్స్ట్రీమ్ పైప్లైన్ పేలుడు వెనక యూకే, అమెరికా..రష్యా ఆరోపణలు..
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
అయితే, 28వ తేదీన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా వార్మప్ మ్యాచ్ లకు భద్రత ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు హెచ్.సీ.ఏకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్ నిర్వహించేలా అధికారులు యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి తెలిపింది. ఇంత వరకు బీసీసీఐ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో హెచ్.సీ.ఏ బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తుంది. మరోవైపు పాక్ -కివీస్ వార్మప్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!