Haryana: హర్యానాలో ఓ కాంట్రాక్టర్కు చిత్రహింసలు.. నోట్లో పేడ, ఉమ్మివేసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు. అనంతరం వారి చెరనుండి బయటపడిన కాంట్రాక్టర్.. పోలీసులకు సమాచారం మొత్తం చెప్పాడు. దీంతో నిందితులు సంత్లాల్తో పాటు అతని ఇద్దరు కుమారులు, సందీప్, వికాస్, పీకే, ఆత్మారామ్, విక్రమ్, నవీన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ రాకేష్ ప్రభుత్వ పనుల కోసం కాంట్రాక్టులు తీసుకుంటాడు. అయితే పొలాల్లో నిర్మించిన రెండు ఇళ్లకు వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేయాలని సదల్పూర్కు చెందిన సంతలాల్ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పొలాలకు వెళ్లే రహదారికి ప్రభుత్వం ఆమోదించింది.. కానీ సంతలాల్ మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పాడు. దీంతో సంతలాల్ కాంట్రాక్టర్ పై పగ పెంచుకున్నాడు.
Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..
అయితే సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల సమయంలో కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో తనను ఓ కారులో వచ్చి ఆపారని కాంట్రాక్టర్ తెలిపాడు. అంతేకాకుండా ఆ కారులో నుంచి సంత్లాల్ కుమారుడు సందీప్, మరో వ్యక్తి వచ్చి తనను కొట్టారన్నాడు. అంతేకాకుండా తనను కారులో తీసుకెళ్తూ కొట్టారని బాధితుడు ఆరోపించాడు. మార్గమధ్యంలో వెళ్తుండగా కళ్లకు గంతలు కట్టినట్లు రాకేష్ చెప్పాడు. పొలాల్లో నిర్మించిన ఓ ఇంటికి తీసుకెళ్లి గదిలోకి తీసుకెళ్లి బెల్టులతో కొట్టారని కాంట్రాక్టర్ చెప్పాడు. అంతేకాకుండా.. కరెంటు షాక్ లు పెడుతూ.. నోటిలో గేదె పేడ పెట్టారని తెలిపాడు. కాంట్రాక్టర్ రాకేష్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారంలో సంత్లాల్, అతని కుమారులతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!