జనసేన పార్టీ అధినేత మరియు ఏపీ డిప్యూట్ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దువ్వాడపై ఫైర్ అవుతోన్న భీమవరం జనసైనికులు.. జనసేన నేత కునా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు..
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ ఔట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సీఐఎస్ఎఫ్డీజి మొహంక్య తదితరులు పాల్గొన్నారు.
Blast: పంజాబ్ రాష్ట్రంలో పేలుడు కలకలం రేపుతుంది. అమృత్సర్లోని పోలీస్స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.
కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది..
Buchepalli Siva Prasad Reddy: దర్శిలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందళోనలో భాగంగా నియోజకవర్గం లోని అన్నీ మండలాల వైసీపీ నాయకులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా దర్శిలో భారీగా పోలీస�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో కత్తితో ఓ వ్యక్తి హంగామా సృష్టించారు. తన భార్య కత్తితో పొడిచిందంటూ ఇంటి ముందు కేకలు పెట్టాడు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చ
మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించాడు. మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ అధికార ప్రతినిధి సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Kamanpur Police: కమాన్పూర్లో కోడి పందేలు జరుగుతుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పందెం కాసిన రెండు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.