US Report: “R&AW, RSSలపై ఆంక్షలు పెట్టాలి”.. యూఎస్ రిపోర్ట్పై భారత్ ఘాటు స్పందన..
- ‘‘రా’’, ఆర్ఎస్ఎస్’’ లపై ఆంక్షలు విధించాలి..
- యూఎస్ రిపోర్ట్పై భారత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: అమెరికాలోని ‘‘యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్(USCIRF)’’ రిపోర్ట్పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత స్వేచ్ఛ ఉల్లంఘన పేరుతో భారత్ను ‘‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశం(కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్CPC)’’ జాబితాలో చేర్చాలని, అలాగే భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్(R&AW), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలని అమెరికా కమిషన్ సూచించింది. అయితే, ఈ నివేదికపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదికను పూర్తిగా పక్షపాతంతో తయారైనదిగా అభివర్ణించారు.
Read Also: Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
USCIRF చాలా సంవత్సరాలుగా భారత్పై చాలా ఏళ్లుగా విషం కక్కుతోందని, ఎంపిక చేసిన సమాచారాన్ని మాత్రమే ప్రదర్శిస్తోందని, ఇది వాస్తవాల కన్నా ఐడియాలజీ ఆధారిత కథనాలపై ఆధారపడుతోందని ఆయన అన్నారు. ఈ తరహా నివేదికలు కమిషన్ విశ్వసనీయతకే నష్టం చేస్తాయని భారత్ పేర్కొంది. భారత్ను విమర్శించడం కన్నా అమెరికాలో హిందూ దేశాలయాలపై జరుగుతున్న దాడులు, విధ్వంసాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది.
USCIRF తన 2026 వార్షిక నివేదికలో (2025 పరిస్థితుల ఆధారంగా) భారత్లో మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించింది. మైనారిటీ మతాలపై ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. అదే విధంగా అమెరికా ప్రభుత్వం రా, ఆర్ఎస్ఎస్లపై లక్ష్యిత ఆంక్షలు విధించాలని సూచించింది. వాటి ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడం, అమెరికాలో ప్రవేశాన్ని నిషేధించడం వంటి చేయాలని సూచించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ‘‘మతమార్పిడి ’’ చట్టాలను కఠినతరం చేస్తున్నాయని చెప్పింది. దీంతో మైనారిటీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!