UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
- మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి
- 6 నెలల తర్వాత ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో కొందరు వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. వ్యామోహమో.. లేదంటే విలాసాల కోసమో.. ఇంకా లేదంటే పడక సుఖం కోసమో తెలియదుగానీ అడ్డదారులు తొక్కుతున్నారు. కలకాలం కలిసుండాల్సిన వైవాహిక బంధం.. మధ్యలోనే కూల్చుకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు పిల్లల తల్లి.. తనకంటే చిన్న వయసు ఉన్న కుర్రాడితో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. 6 నెలలు సహజీవనం చేసిన తర్వాత సీన్ రివర్స్ అయింది. అసలేమైంది? 6 నెలల తర్వాత ఎందుకు బెడిసికొట్టిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం.. తాజా దాడుల్లో 26 మంది మృతి
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా, లలిత్ కుమార్ మిశ్రా భార్యాభర్తలు. వీరికి ఏడు, ఆరు సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతున్న సమయంలో పూజా మిశ్రా అడ్డదారులు తొక్కింది. ఇంట్లో సహాయంగా ఉన్న లలిత్ కుమార్ మిశ్రా మేనల్లుడైన అలోక్ మిశ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండానే మేనల్లుడితో ఎఫైర్ సాగిస్తోంది. విచిత్రమేంటంటే.. అలోక్ మిశ్రా.. పూజా మిశ్రా కంటే 15 సంవత్సరాలు చిన్నవాడు. అయినా కూడా అతడితో వివాహేర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే పూజా-అలోక్ ఒక రోజు ఏకాంతంగా ఉన్నప్పుడు లలిత్ కుమార్ మిశ్రా చూసేశాడు. దీంతో అలోక్ మిశ్రాను బరేలీకి పంపేశాడు.
ఇది కూడా చదవండి: Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ
అయితే పూజా మిశ్రా.. అలోక్ మిశ్రాను విడిచిపెట్టి ఉండలేకపోవడంతో భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి బరేలీ వెళ్లి అలోక్ మిశ్రాతో సహజీవనం చేస్తోంది. ఇలా ఆరు నెలలు బాగానే కలిసి జీవించారు. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఇద్దరు మధ్య విభేదాలు తలెత్తాయి. ఘర్షణ తీవ్ర కావడంతో సొంత గ్రామం సీతాపూర్లో పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే ఇక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్కు చేరింది. ఇకపై పూజాతో ఉండేది లేదంటూ అలోక్ మిశ్రా పోలీసుల ముందు తేల్చిచెప్పేశాడు. ఈ పరిణామంతో షాకైన పూజా మిశ్రా బ్లేడ్తో మణికట్టును కోసేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండడంతో లోక్నోకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
- Tags
- mother
- nephew
- police station
- UP
- UP woman
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!