Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించింది. మధ్యప్రదేశ్లోని దేవాస్లో తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనలో భద్రత లోపం వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండిపెంట హెలిపాడ్లో ప్రధానికి వీడ్కోలు సమయంలో పాస్ల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం కలకలం సృష్టించింది. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.
Tragedy : కరీంనగర్ జిల్లాలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్యకేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మొదట అనుమానాస్పద మరణం కేసుగా నమోదు చేసిన ఈ ఘటనను, పూర్తి దర్యాప్తు తర్వాత భార్య సహా ఆరుగురి కుట్ర ద్వారా జరిగిందని తేల్చారు. కరీంనగర్ లోని సప్తగిరి కాలనీకి చెందిన ప్రైవేట్ డ్రైవర్ కత్తి సురేష్, 2015లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మౌనిక డబ్బుల కోసం పడుపు వృత్తిని…
Bengal Rape Case: బెంగాల్లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Shocking : నాగర్కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఒక మహిళ మృతదేహం గుర్తించడంతో కలకలం రేగింది. అడవిలో దుర్వాసన వస్తోందని గుర్తించిన గ్రామస్థులు దగ్గరగా వెళ్లి చూసే సరికి భయానక దృశ్యం కనబడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పెంట్లవెల్లి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. Madagascar Government Dissolved: మడగాస్కర్లో తిరుగుబాటు.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన అధ్యక్షుడు! ఇప్పుడు ఏం జరగబోతుంది? మృతదేహం తీవ్రంగా…
Nude Calls : ఈజీ మనీ కోసం అడ్డదార్లు దొక్కుతున్నారు కొందరు అక్రమార్కులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు ప్లాన్ వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో వెలుగు చూసిన చామెట్ యాప్ న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చామెట్ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చామెట్ యాప్ పేరుతో డబ్బులకు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తేలింది.…