Bengaluru: కూతురుతో పెళ్లి తిరస్కరించిందని.. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంట్లో అద్దెకు దిగిన యువకుడు
- కూతురుతో పెళ్లి తిరస్కరించిందని
- తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
- నిందితుడు టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని బసవేశ్వరనగర్ ప్రాంతంలో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. 28 ఏళ్ల అద్దెదారుడు ఆగ్రహానికి గురై 45 ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మహిళ తన కుమార్తెతో యువకుడి వివాహ ప్రతిపాదనను నిరాకరించడమే దీనికి కారణం. ఆ మహిళ పేరు గీత. ఆమె ఒక కిరాణా దుకాణం నడుపుతోంది. ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు.
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గీత ఇంట్లో అద్దెకు తీసుకున్న భాగంలో ముత్తు అభిమన్యు అనే నిందితుడు టీ స్టాల్ నడిపేవాడు. ఆ స్టాల్ లో ఒకే ఒక గది, టాయిలెట్ మాత్రమే ఉండేది. గీత కూతురు (19 ఏళ్లు) బిబిఎ రెండో సంవత్సరం చదువుతున్న ఆమెకు అభిమన్యు ప్రపోజ్ చేశాడు. ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో, అభిమన్యు గీతను ఒప్పించమని ఒత్తిడి చేశాడు. అయితే, గీత దానిని పూర్తిగా తిరస్కరించింది.
Also Read:Gambhir vs Rohit: విజయ్ హజారేలో రోహిత్ శర్మ విధ్వంసం.. ‘గంభీర్ ఎక్కడ?’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో అభిమన్యు, గీత ఈ విషయంపై గొడవ పడ్డారు. గీత మళ్ళీ నిరాకరించడంతో, అభిమన్యు ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంతో గీతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గీత అరుపులు విని ఆమె కూతురు అక్కడికి పరుగెత్తింది, కానీ అప్పటికే అభిమన్యు అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే స్పందించిన పొరుగువారు గీతను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయని, ప్రాణాలతో పోరాడుతోందని వైద్యులు చెబుతున్నారు. గీత భర్త విజయ్ కుమార్ కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..