Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ..
- పోలీస్ అకాడమీలోనే రక్షణ లేదు..
- క్యాంపస్లోని గంధపు చెట్లను చోరీ చేసిన దొంగలు..
- 30 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న చెట్ల వెల లక్షల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Academy: కేరళలో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు. పోలీస్ అకాడమీలోని చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది. క్యాంపస్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ముందుగా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. అకాడమీ ఎస్టేట్ అధికారి సతీష్ టియు వియ్యూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు..!
Also Read
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
త్రిస్సూర్ పోలీస్ అకాడమీ జిల్లాలోనే అత్యంత సురక్షితం ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. సాయుధ పోలీస్ సిబ్బంది క్యాంపస్లో రాత్రింతా కాపలా కాస్తారు. ప్రతీ రోజు వందలాది మంది పోలీసుల ఉనికి ఉంటుంది. శిక్షణ పొందుతున్న వారు ఈ క్యాంపస్లో ఉంటారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం తర్వాత, ఇది కేరళ పోలీసులకు చెందిన అతిపెద్ద శిక్షణా కేంద్రం. ఇది దాదాపుగా 348 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ, క్యాంపస్లోకి ప్రవేశించి గంధపు చెట్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 27 మరియు జనవరి 2 మధ్య ఈ నేరం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అకాడమీ క్యాంపస్లోని పెద్ద భాగాలు అడవులతో నిండి ఉన్నాయి. ఎస్టేట్లో అక్కడక్కడా గంధపు చెట్లు, రోజ్ వుడ్, టేకు చెట్లు ఉన్నాయి. విస్తారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం సవాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. దొంగతనం తర్వాత, అకాడమీ అధికారులు రాత్రి పూట గస్తీని ముమ్మరం చేశారు. బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడంపై కఠినమైన తనిఖీ చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
-
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
-
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్న్యూస్.?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!