Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ..
- పోలీస్ అకాడమీలోనే రక్షణ లేదు..
- క్యాంపస్లోని గంధపు చెట్లను చోరీ చేసిన దొంగలు..
- 30 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న చెట్ల వెల లక్షల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Academy: కేరళలో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు. పోలీస్ అకాడమీలోని చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది. క్యాంపస్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ముందుగా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. అకాడమీ ఎస్టేట్ అధికారి సతీష్ టియు వియ్యూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు..!
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
త్రిస్సూర్ పోలీస్ అకాడమీ జిల్లాలోనే అత్యంత సురక్షితం ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. సాయుధ పోలీస్ సిబ్బంది క్యాంపస్లో రాత్రింతా కాపలా కాస్తారు. ప్రతీ రోజు వందలాది మంది పోలీసుల ఉనికి ఉంటుంది. శిక్షణ పొందుతున్న వారు ఈ క్యాంపస్లో ఉంటారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం తర్వాత, ఇది కేరళ పోలీసులకు చెందిన అతిపెద్ద శిక్షణా కేంద్రం. ఇది దాదాపుగా 348 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ, క్యాంపస్లోకి ప్రవేశించి గంధపు చెట్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 27 మరియు జనవరి 2 మధ్య ఈ నేరం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అకాడమీ క్యాంపస్లోని పెద్ద భాగాలు అడవులతో నిండి ఉన్నాయి. ఎస్టేట్లో అక్కడక్కడా గంధపు చెట్లు, రోజ్ వుడ్, టేకు చెట్లు ఉన్నాయి. విస్తారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం సవాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. దొంగతనం తర్వాత, అకాడమీ అధికారులు రాత్రి పూట గస్తీని ముమ్మరం చేశారు. బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడంపై కఠినమైన తనిఖీ చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?