జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి.
భారతదేశంలో మొబైల్ నెట్ వర్క్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5 జీ ప్రారంభానికి డేట్ పిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో 5 జీ సేవలు ప్రారంభించనున్నారు.
జరాత్లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని రాజకీయ అండదండలతో "అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధకులు" చాలా సంవత్సరాలుగా ఈ డ్యామ్ పర్యావరణానికి హాని కలిగిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ పనులను అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
sabka saath sabka vikas sabka vishwas book release: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రసంగాలను సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.…
PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
Imran Khan once again praised PM Modi: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. అవినీతి విషయంలో ఆ దేశ మాజీ ప్రధాని ముస్లింలీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ విమర్శిస్తూ.. భారత ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడు కూడా నవాజ్ షరీఫ్ సంపాదించినంతగా విదేశాల్లో ఆస్తుల్ని కూడబెట్టలేదని విమర్శలు గుప్పించారు. నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల ఆస్తులను కలిగి ఉన్నారని అన్నారు.…
విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు.
France and USA praised Prime Minister Modi's comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ…
ప్రధానిపై మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ బెంగాల్ అసెంబ్లీలో మోడీకి మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.