Shinzo Abe: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కంటే షింజో అబే వీడ్కోలుకు అధిక ఖర్చు.. ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఖర్చు క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కంటే చాలా ఎక్కువని పేర్కొన్నాయి. ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపు 1.3 బిలియన్ల యెన్లు ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ ఈవెంట్కు ఎక్కువ ఖర్చు చేయడాన్ని దేశ ప్రజలు ప్రశ్నిస్తు్న్నారు. ఈ ఏడాది జూలైలో షింజో అబే హత్యకు గురైన సంగతి తెలిసిందే.
షింజో అబే సంస్మరణ సభ నిర్వహించే కాంట్రాక్ట్ టోక్యోకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ మురయామాకు ఇవ్వబడింది. ప్రభుత్వం ఎందుకు అంత ఖర్చు చేస్తోందంటూ ఈ కార్యక్రమాన్ని చాలా మంది జపనీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభపై నిరసన తెలుపుతూ ప్రధాని ఫుమియో కిషిడా కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్నాడు. ది గార్డియన్ నివేదిక ప్రకారం, జపాన్ ప్రభుత్వం రాష్ట్ర అంత్యక్రియల అంచనా వ్యయం 250 మిలియన్ యెన్లుగా పేర్కొంది. క్యాబినెట్ చీఫ్ సెక్రటరీ హిరోకాజు మాట్సునో ప్రకారం, ఈవెంట్పోలీసింగ్ కోసం దాదాపు 800 మిలియన్ యెన్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడానికి 600 మిలియన్ యెన్లు ఖర్చవుతాయని అంచనా. ఈ బిల్లు మొత్తంగా 1.7 బిలియన్ యెన్లకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు. గతంలో టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ 13 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఈవెంట్ కోసం అంచనా వేసిన బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు.
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో శశిథరూర్.. ఆ ఇద్దరి మధ్యే పోటీ!
జపాన్ ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన షింజో అబే జులైలో హత్యకు గురయ్యారు. నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీనితో అబే వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!