Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు
PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, పోప్ ప్రాన్సిస్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని లూయిస్ ఎబ్రార్డ్ యూఎన్ లో ప్రతిపాదించారు. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ శికరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన తర్వాత.. మెక్సికో విదేశాంగ మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ప్రధాని వ్యాఖ్యలను అమెరికా, కెనడా, ప్రాన్స్, యూకేతో పాటు వెస్ట్రన్ దేశాలు స్వాగతించాయి.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Read Also: National Herald Case: తెలంగాణకు తాకిన నేషనల్ హెరాల్డ్ కేసు.. టీకాంగ్ నేతలకు నోటీసులు..
అంతర్జాతీయ సమాజం శాంతిని సాధించేందుకు ప్రయత్నించాలని మెక్సికో కోరుకుంటోందని లూయిస్ ఎబ్రార్డ్ అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, శాంతిని కాపాడేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యయోల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రతిపాదనను మీతో పంచుకుంటున్నానని భద్రతా మండలిలో లూయిస్ ఎబ్రార్డ్ తెలియజేశారు. చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు.
గురువారం జరిగిన యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, పుతిన్ తో అన్న మాటలను మరోసారి గుర్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భారత్ కూడా ఆహార కొరత, ఎరువులు కొరతకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో