గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7), క్వాడ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహా మూడు కీలక బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలలో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.
PM Rozgar Mela: 10 నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇవాళ పిఎం రోజ్ గార్ మేళ ప్రారంభంకానుంది.
Union Minister Kaushal Kishore: భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని తెలిపారు కేంద్రమంత్రి కౌషల్ కిషోర్.. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో 5వ రోజ్ గార్ (జాబ్) మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 300 మందికి నియామక పత్రాలు అందజేశారు.. రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించగా..…
Himanta Biswa Sarma: కాంగ్రెస్ గెలుపుపై బీజేపీయేతర విపక్షాలు అభినందనలు తెలియజేస్తున్నారు. కొందరు విపక్షాల ఐక్యతకు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా అందులో చేరాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ విషయం దేశంపై ప్రభావం చూపించదని.. 2024 లోక్ సభ ఎన్నికలపై దీని ఎఫెక్ట్ ఉండదని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.
Pallam Raju: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. అయితే, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు మార్గం సుగమం చేస్తోంది.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ సీనియర్ నేత పల్లంరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్నాటక కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేసి…
DK Shivakumar: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం వైపు వెళ్తోంది. మెజారిటీ మార్కును దాటేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 138 స్థానాల్లో, బీజేపీ 63, జేడీఎస్ 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయంపై కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమతో విజయం సాధించామని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ద్వేషం యొక్క మార్కెట్ మూసివేయబడింది మరియు ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి" అని ఆయన అన్నారు.
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
Mann Ki Baat : చండీగఢ్ లోని ఓ నర్సింగ్ కాలేజీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మన్ కీ బాత్ వినలేదని నర్సింగ్ స్టూడెంట్లను వారం పాటు హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.