Vande Bharat Trains: ఒకే రోజు 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభం.. ఏయే రూట్లలో తెలుసా..?
Vande Bharat Trains: భారత రైల్వేలు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ వరసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 5 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ జూన్ 26న ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వీటిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: No lungi or nighty: లుంగీ కట్టుకోవద్దు, నైటీ ధరించొద్దు.. ఓ అపార్ట్మెంట్ వింత రూల్స్..
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
ముంబై-గోవా, బెంగళూరు-హుబ్లీ, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్ మరియు భోపాల్-జబల్పూర్ రూట్లలో వీటిని ప్రారంభించనున్నారు. ముంబై-గోవా వందే భారత్ ట్రైన్ ని ఇది వరకే ప్రారంభించాల్సి ఉన్నా.. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన కారణంగా వాయిదా వేశారు. ఐదు వందే భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు పలు రూట్లలో 17 వందే భారత్ ఎక్స్ ప్రెసులు నడుస్తున్నాయి. వీటికి తోడుగా మే 26 నుంచి మరో ఐదు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలో అన్ని రాష్ట్రాలకు వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతీయ రైల్వేలో ఆధునాతనమైన రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు పలు మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచాలనే ఉద్దేశంతో వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రారంభించారు. పూర్తిగా దేశీయంగా ఈ రైళ్లను తయారు చేస్తున్నారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం భారత్ లో ఉన్న రైల్వే మార్గాలు అంత స్పీడ్ కు అనుకూలంగా లేకపోవడంతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకే అనుమతి ఉంది. రానున్న కాలంలో మరింత వేగంగా వెళ్లేందుకు రైల్వే ట్రాకులను అప్ గ్రేడ్ చేయాలని రైల్వే భావిస్తుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!