Sukesh Chandrashekhar: జైలు నుంచే రూ.10 కోట్ల విరాళం.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrashekhar: అవినీతి, మనిలాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అతను అక్కడ నుంచి ఆప్ పార్టీ, సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. మరోవైపు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెస్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు సుకేష్ చంద్రశేఖర్. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల కోసం ఏకంగా రూ.10 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Ukraine War: పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన క్రెమ్లిన్..
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
విరాళానికి సంబంధించి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేక రాశారు. తాను ఇవ్వాలనుకుంటున్న రూ. 10 కోట్లు తన వ్యక్తిగత నిధి నుంచి, చట్టబద్ధంగా సంపాదించిన దాని నుంచి ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధిని ఉపయోగించాల్సిందిగా కోరాడు. ఒక బాధ్యతాయుతమైన మరియు మంచి పౌరుడిగా, ఈ రూ. 10 కోట్ల నిధిని బాధిత కుటుంబాల పిల్లల విద్య కోసం ఇస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నాడు. సర్వత చర్యలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోడీని, రైల్వే శాఖను ప్రశంసించారు. సుకేష్ తన సంస్థ శారదా ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎల్ఎస్ ఎడ్యుకేషన్, దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ రంగాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల నుంచి సుకేష్ చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేశాడు. మాజీ ఫార్మా కంపెనీ రాన్బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ను రూ.200 కోట్లు మోసం చేశాడు. మనీలాండరింగ్ కు పాల్పడినందుకు ఈడీ సుకేష్ ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా నిందితురాలిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!