Sukesh Chandrashekhar: జైలు నుంచే రూ.10 కోట్ల విరాళం.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrashekhar: అవినీతి, మనిలాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అతను అక్కడ నుంచి ఆప్ పార్టీ, సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. మరోవైపు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెస్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు సుకేష్ చంద్రశేఖర్. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల కోసం ఏకంగా రూ.10 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Ukraine War: పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన క్రెమ్లిన్..
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
విరాళానికి సంబంధించి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేక రాశారు. తాను ఇవ్వాలనుకుంటున్న రూ. 10 కోట్లు తన వ్యక్తిగత నిధి నుంచి, చట్టబద్ధంగా సంపాదించిన దాని నుంచి ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధిని ఉపయోగించాల్సిందిగా కోరాడు. ఒక బాధ్యతాయుతమైన మరియు మంచి పౌరుడిగా, ఈ రూ. 10 కోట్ల నిధిని బాధిత కుటుంబాల పిల్లల విద్య కోసం ఇస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నాడు. సర్వత చర్యలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోడీని, రైల్వే శాఖను ప్రశంసించారు. సుకేష్ తన సంస్థ శారదా ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎల్ఎస్ ఎడ్యుకేషన్, దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ రంగాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల నుంచి సుకేష్ చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేశాడు. మాజీ ఫార్మా కంపెనీ రాన్బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ను రూ.200 కోట్లు మోసం చేశాడు. మనీలాండరింగ్ కు పాల్పడినందుకు ఈడీ సుకేష్ ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా నిందితురాలిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!