Sukesh Chandrashekhar: జైలు నుంచే రూ.10 కోట్ల విరాళం.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrashekhar: అవినీతి, మనిలాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అతను అక్కడ నుంచి ఆప్ పార్టీ, సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. మరోవైపు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెస్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు సుకేష్ చంద్రశేఖర్. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల కోసం ఏకంగా రూ.10 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Ukraine War: పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన క్రెమ్లిన్..
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
విరాళానికి సంబంధించి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేక రాశారు. తాను ఇవ్వాలనుకుంటున్న రూ. 10 కోట్లు తన వ్యక్తిగత నిధి నుంచి, చట్టబద్ధంగా సంపాదించిన దాని నుంచి ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధిని ఉపయోగించాల్సిందిగా కోరాడు. ఒక బాధ్యతాయుతమైన మరియు మంచి పౌరుడిగా, ఈ రూ. 10 కోట్ల నిధిని బాధిత కుటుంబాల పిల్లల విద్య కోసం ఇస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నాడు. సర్వత చర్యలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోడీని, రైల్వే శాఖను ప్రశంసించారు. సుకేష్ తన సంస్థ శారదా ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎల్ఎస్ ఎడ్యుకేషన్, దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ రంగాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల నుంచి సుకేష్ చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేశాడు. మాజీ ఫార్మా కంపెనీ రాన్బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ను రూ.200 కోట్లు మోసం చేశాడు. మనీలాండరింగ్ కు పాల్పడినందుకు ఈడీ సుకేష్ ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా నిందితురాలిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..