PM Modi: దేశంలోని 8.5 కోట్ల మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు పీఎం కిసాన్ నిధి రూపంలో బహుమతిగా ఇవ్వబోతున్నారు. నేడు 14వ విడత పథకం రైతులకు విడుదల చేసి రైతుల ఖాతాలో రూ.17000 కోట్లు విడుదల చేయనున్నారు.
కేంద్రంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
Parliament Monsoon Session: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి సిద్ధమైంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే మణిపూర్తో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి ముట్టడిస్తోంది.
ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం, భారత సర్కార్ దగ్గర ప్రతిపాదనలను ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్ మారనుందని ప్రధని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా 'రోజ్గార్ మేళా' సందర్బంగా 70,000 మంది యువతకు ప్రధాని జాబ్ లెటర్లను వర్చువల్గా అందజేశారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (జూలై 22) దాదాపు 70,000 మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) శుక్రవారం (జూలై 21) ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు.