Narendra Modi : ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్నగర్ జిల్లాకు రానున్న మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో చేయాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహబూబ్ నగర్ కి మార్పు చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్కు కాకుండా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మోడీ లాండ్ కానున్నారు.
Also Read : Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
అక్టోబర్ 1న మధ్యాహ్నం 1.30 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మోడీ చేరుకుంటారు. 1:35 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి హెలిక్యాప్టర్ లో మహబూబ్ నగర్ కి బయలు దేరుతారు. 2:10 మహబూబ్ నగర్ కు చేరుకోనున్న మోడీ.. 2.15 నుండి 2.50 వరకు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగ సభ, 4.10 నిమిషాలకు మహబూబ్ నగర్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ కి వస్తారు. 4.50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ మోడీ తిరుగుప్రయాణం కానున్నారు.
Also Read : Maama Mascheendra Trailer: మామను చెడుగుడు ఆడడానికే పుట్టిన అల్లుళ్ల కథ ..
ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరీ సభలో పాల్గొని.. ఈ సభావేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని మోడీ పూరించనున్నారు. ఆ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలిపై ధ్వజమెత్తనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్వయంగా పరిశీలిస్తుండగా.., మహబూబ్నగర్లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!