మీరు మణిపూర్లో భారత మాతను చంపేశారు.. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహలు.. మణిపూర్ను రెండు భాగాలుగా విభజించారు.. మోడీకి ఈ దేశ గుండె చప్పుడు వినే సమయం లేదు.. మోడీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటారు అంటూ రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని మూడు అంశాలపై ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ప్రధాని శాంతికి పిలుపు ఇచ్చి ఉంటే అది చాలా ప్రభావవంతంగా ఉండేది.. మణిపూర్కు విపక్షాలు వెళ్లాయి, రాహుల్ వెళ్లారు, మోడీ ఎందుకు వెళ్లలేదు? మణిపూర్ తగలబడుతుంటే.. భారత్ తగలబడుతున్నట్లేనని ఆయన తెలిపారు.
మోడీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందింది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయి.. 2014కి- 2023కి రైల్వే శాఖకు బడ్జెట్ కు 17రేట్లు పెరిగింది.. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు నేడు( ఆదివారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన కేంంద్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.24.50 కోట్లు విడుదల చేసింది.
Sisters of PM Modi, CM Yogi meet at Uttarakhand Temple: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరీమణులు ఉత్తరాఖండ్లో కలుసుకున్నారు. ప్రధాని మోదీ సోదరి వాసంతీ బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి దేవిలు కొఠారీలోని ఓ దేవాలయం సమీపంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రావణ మాసం సందర్భంగా శివుని దర్శనం కోసం…
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు.