Home Loan Scheme: నగరాల్లో నివసించే నిరుపేదలకు శుభవార్త.. చౌకగా గృహరుణాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Loan Scheme: పట్టణాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇళ్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చౌకగా గృహ రుణాలు అందించే పథకాన్ని తీసుకురానుంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయడానికి దగ్గరగా ఉందని, దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. “ప్రభుత్వం కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్తో ముందుకు వస్తుంది, ఇది నగరాల్లో నివసించే నిరుపేద ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వడ్డీ రేట్లలో ఉపశమనంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి మేము వారికి సహాయం చేస్తాము.” అని ప్రధాని మోడీ తెలిపారు.
Also Read: S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఈ పథకం కింద బలహీన వర్గాలకు తక్కువ వడ్డీలకు గృహ రుణాలు అందించబడతాయి. వడ్డీ రాయితీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, రీటైల్ రంగంపై దాని ప్రభావం గురించి కూడా చర్చించారు. ముడిచమురు ధర బ్యారెల్కు 96 డాలర్లకు చేరిందన్నది వాస్తవమని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడు ధరలు పెరిగినా భారత్లో ధరలు ఐదు శాతం తగ్గేవి. ప్రధాని తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం రెండు పర్యాయాలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆయన వెల్లడించారు.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంపై కేంద్ర మంత్రి దాడి చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే బెంగాల్ లాంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.11.80 పెరగడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ పరిస్థితి పూర్తిగా తప్పని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ను తగ్గిస్తున్నాయని, దీనిపై బీజేపీయేతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!