PM Modi: నా పేరు మీద సొంతిల్లు లేదు కానీ.. గుజరాత్లో ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తన పేరు మీద ఇల్లు లేదు కానీ.. తమ ప్రభుత్వం దేశంలో లక్షలాది మంది ఆడపిల్లలను ఇంటి యజమానులను చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. చోటాఉదయ్పూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గిరిజనులు అధికంగా ఉండే బోడేలి పట్టణంలో విద్యా రంగానికి సంబంధించిన రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులతో సహా రూ.5,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Also Read: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
పేదప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని, ఆ సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల కోసం నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించినందుకు తాను సంతృప్తి చెందానన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా. పేదలకు ఇళ్లు అనేది కేవలం నంబర్ మాత్రమే కాదు.. పేదలకు ఇళ్లు కట్టించడం ద్వారా వారికి గౌరవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘‘పేదల అవసరాల మేరకు ఇళ్లు కట్టిస్తున్నాం, అది కూడా మధ్య దళారుల బెడద లేకుండా.. లక్షలాది ఇళ్లు కట్టించి మా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాం.. నా పేరు మీద ఇల్లు లేకపోయినా తన ప్రభుత్వం లక్షల మంది కూతుళ్లను ఇంటి యజమానులను చేసింది.” అని అన్నారు.
Also Read: UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
గాంధీనగర్లోని ‘విద్యా సమీక్షా కేంద్రం’ అని పిలువబడే గుజరాత్ విద్యా శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఎంతగానో ఆకట్టుకున్నారని, దేశవ్యాప్తంగా అలాంటి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన కోరారు. మూడు దశాబ్దాలుగా సందిగ్ధంలో ఉన్న కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని ఎట్టకేలకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రధాని చెప్పారు. ఎటువంటి పేర్లు ప్రస్తావించకుండా, ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై కూడా “వారు రిజర్వేషన్ రాజకీయాలలో మునిగిపోయారు” అని విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు గుజరాత్లోని గిరిజన ప్రాంతాల్లో సైన్స్ పాఠశాలలేవీ పనిచేయలేదని…మీకు సైన్స్ స్కూల్స్ లేకపోతే మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎలా ప్రవేశం కల్పిస్తారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!