Etela Rajender: అభివృద్ధి పనుల కోసమే తెలంగాణకు మోడీ.. తన స్థాయికి తగ్గట్టు కేటీఆర్ మాట్లాడాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన, సభ ఏర్పాట్లను బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్, అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. నిజమాబాద్ పర్యటనలో ఎన్టీపీసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు అంటూ ఆయన తెలిపారు.
Read Also: Mahalakshmi: నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. నిర్మాత భార్య సంచలన ఆరోపణలు
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ అన్నారు. అభివృద్ధి పనుల కోసమే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు.. రాజకీయాల కోసం కాదు అని ఆయన తెలిపారు. 3 వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వకున్నా రామగుండం కర్మాగారాన్ని పునరుద్ధరించాం.. పంచాయతీ భవనం మొదలు అన్నింట్లో కేంద్ర సర్కార్ నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ, మొత్తం నేనే ఇస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు.
Read Also: S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్
మరోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను వచించే ప్రయత్నం చేస్తున్నాడని ఈటెల రాజేందర్ అన్నారు. కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాని పెద్ద మొత్తంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు అని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించే కేసీఆర్, కేటీఆర్.. ఒకసారి వచ్చి చూడండి ఏం ఇస్తుంది అనేది అని ఈటెల చెప్పాడు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!