Venu Swamy took a sensational decision after YCP Defeat: సినీ సెలబ్రిటీలే కాకుండా రాజకీయ ప్రముఖుల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి ఏ రాజకీయ ప్రిడిక్షన్స్ కానీ, సినిమా పరిశ్రమకు చెందిన వారి ప్రిడిక్షన్స్ కానీ సోషల్ మీడియాలో చెప్పను అని తెలిపాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నా అని వేణు…
సార్వత్రిక ఎన్నికల ప్రజా తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లగా, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. ఈ రెండు స్థానాలు – గుజరాత్లోని సూరత్, మధ్యప్రదేశ్లోని ఇండోర్.
INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది.
Lok Sabha Elections: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు SBSP అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్వాదీ, కాంగ్రెస్లు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎన్డీయే మిత్రపక్షం ఓం ప్రకాష్ రాజ్భర్ ఉత్తరప్రదేశ్లోని లోక్సభ స్థానంలో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యాన్ని సమర్ధిస్తూ.. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్భర్ తెలిపారు. మరోవైపు.. బీజేపీ గెలుపు ఖాయమని కూటమి నేతలు దుబాయ్,…
స్టాక్ మార్కెట్లకు సరికొత్త ఊపు వచ్చింది. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మార్కెట్లకు ఊపిరి పోశాయి. ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారన్న పోల్స్ పల్స్ను బట్టి సూచీలు కొత్త జోష్ నింపాయి. ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి.
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.