China: కలిసి పనిచేసేందుకు సిద్ధం.. పీఎం మోడీకి చైనా ప్రధాని అభినందనలు..
- ప్రధాని మోడీకి చైనా ప్రీమియర్ అభినందలు..
- కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న లీ కియాంగ్..
- గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణత..
- ‘వన్ చైనా’ పాలసీని గౌరవించాలన్న చైనా
China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు. రెండు దేశాల పటిష్టమైన, స్థిరమైన అభివృద్ధి రెండు దేశాల ప్రజల శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతం మరియు ప్రపంచ స్థిరత్వానికి సానుకూల శక్తిని ఇస్తుందని లీ కియాంగ్ తన సందేశంలో పేర్కొన్నట్లు చైనీస్ మీడియా నివేదించింది.
2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినందుకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేసింది. నాలుగేళ్ల క్రితం గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య దిగజారిన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది.
Also Read
- Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- TVK Vijay: "ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర".. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
మే 5, 2020లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. పలుమార్లు సైనిక స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మేము గమనించాము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాము’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్ తే ప్రధాని మోడీ విజయానికి శుభాకాంక్షలు చెప్పడం, దీనికి మోడీ స్పందించడంపై చైనా రగిలిపోతోంది. తైవాన్ ‘‘వన్ చైనా విధానం’’లో అంతర్భాగమని పేర్కొంది. భారత్ దీనిని గౌరవించాలని కోరింది.
తాజావార్తలు
-
Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
-
Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
-
Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?