China: కలిసి పనిచేసేందుకు సిద్ధం.. పీఎం మోడీకి చైనా ప్రధాని అభినందనలు..
- ప్రధాని మోడీకి చైనా ప్రీమియర్ అభినందలు..
- కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న లీ కియాంగ్..
- గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణత..
- ‘వన్ చైనా’ పాలసీని గౌరవించాలన్న చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు. రెండు దేశాల పటిష్టమైన, స్థిరమైన అభివృద్ధి రెండు దేశాల ప్రజల శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతం మరియు ప్రపంచ స్థిరత్వానికి సానుకూల శక్తిని ఇస్తుందని లీ కియాంగ్ తన సందేశంలో పేర్కొన్నట్లు చైనీస్ మీడియా నివేదించింది.
2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినందుకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేసింది. నాలుగేళ్ల క్రితం గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య దిగజారిన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
మే 5, 2020లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. పలుమార్లు సైనిక స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మేము గమనించాము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాము’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్ తే ప్రధాని మోడీ విజయానికి శుభాకాంక్షలు చెప్పడం, దీనికి మోడీ స్పందించడంపై చైనా రగిలిపోతోంది. తైవాన్ ‘‘వన్ చైనా విధానం’’లో అంతర్భాగమని పేర్కొంది. భారత్ దీనిని గౌరవించాలని కోరింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!