Eknath Shinde: మమ్మల్ని ఈ ఎన్నికల్లో ఏడిపించింది ఉల్లిపాయలే..
- మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..
- వ్యవసాయ సంక్షోభం వల్లే మహాయుతి కూటమికి తీవ్ర నష్టం..
- ఎన్నికల్లో ఉల్లిపాయలే మమ్మల్ని బాగా ఏడిపించింది: సీఎం షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో వ్యవసాయ సంక్షోభం అధికార మహాయుతి కూటమికి తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని వెల్లడించారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లి.. వీటి కారణంగానే తాము సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని బాగా ఏడిపించిందని సీఎం షిండే కామెంట్స్ చేశారు.
Read Also: AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.
Also Read
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
ఇక, వ్యవసాయ సంబంధిత సమస్యల గురించి తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇప్పటికే మాట్లాడినట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. అలాగే.. ఉల్లి, సోయాబీన్, పత్తికి కనీస మద్దతు ధర నిర్ణయించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రితోనూ చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, చిల్లర ధరలను నియంత్రించేందుకు గతేడాది డిసెంబర్లో ఉల్లిపాయల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ముఖ్యంగా నాసిక్ బెల్ట్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో మే ప్రారంభంలో దీనిపై ఉన్న బ్యాన్ ఎత్తేశారు. దీని ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో మాపై పడింది. శివసేన(షిండే), దాని మిత్రపక్షం బీజేపీ నాసిక్, దిండోరి లోక్సభ స్థానాలను కోల్పోయాయని చెప్పుకొచ్చారు. మరఠ్వాడాలో ఒక సీటును, విదర్భలో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకున్నామని సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
తాజావార్తలు
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..