Eknath Shinde: మమ్మల్ని ఈ ఎన్నికల్లో ఏడిపించింది ఉల్లిపాయలే..
- మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..
- వ్యవసాయ సంక్షోభం వల్లే మహాయుతి కూటమికి తీవ్ర నష్టం..
- ఎన్నికల్లో ఉల్లిపాయలే మమ్మల్ని బాగా ఏడిపించింది: సీఎం షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో వ్యవసాయ సంక్షోభం అధికార మహాయుతి కూటమికి తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని వెల్లడించారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లి.. వీటి కారణంగానే తాము సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని బాగా ఏడిపించిందని సీఎం షిండే కామెంట్స్ చేశారు.
Read Also: AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.
Also Read
ఇక, వ్యవసాయ సంబంధిత సమస్యల గురించి తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇప్పటికే మాట్లాడినట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. అలాగే.. ఉల్లి, సోయాబీన్, పత్తికి కనీస మద్దతు ధర నిర్ణయించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రితోనూ చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, చిల్లర ధరలను నియంత్రించేందుకు గతేడాది డిసెంబర్లో ఉల్లిపాయల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ముఖ్యంగా నాసిక్ బెల్ట్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో మే ప్రారంభంలో దీనిపై ఉన్న బ్యాన్ ఎత్తేశారు. దీని ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో మాపై పడింది. శివసేన(షిండే), దాని మిత్రపక్షం బీజేపీ నాసిక్, దిండోరి లోక్సభ స్థానాలను కోల్పోయాయని చెప్పుకొచ్చారు. మరఠ్వాడాలో ఒక సీటును, విదర్భలో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకున్నామని సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!