PM Modi: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు.. కారణమిదే!
- మోడీ సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు
- మోడీ కా పరివార్ అనే నినాదం తొలగించాలని పిలుపు
- ఎక్స్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్.. కవర్ ఇమేజ్లు మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ పక్షాలకు ఆయా శాఖలు దక్కాయి. ఇక బీజేపీ కేంద్రమంత్రులకు పాత శాఖలే దక్కాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు చేశారు.
ఇది కూడా చదవండి: Snakebite: పాముకాటుకు బాలిక బలి.. ములుగు జిల్లాలో ఘటన
Also Read
- CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ఎన్నికల సమయంలో బీజేపీ నేతల సోషల్ మీడియా ఖాతాల్లో మోడీ కా పరివార్ అనే నినాదం ప్రత్యేకంగా కనిపించింది. ‘‘ప్రధానికి కుటుంబం లేదు. అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు’’ అని ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్గా కమలం పార్టీ నేతలు ఆ నినాదాన్ని ప్రతిధ్వనింపజేశారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాని మోడీ కీలక సూచన చేశారు. మనమంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని ‘మోడీ కా పరివార్’ సమర్థంగా చాటిచెప్పిందని, ఇప్పుడు దీన్ని తొలగించాల్సిందిగా ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: కథువాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం..
ఎన్నికల సమయంలో తన మీద అభిమానానికి గుర్తుగా ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతా పేర్లలో ‘మోడీ కా పరివార్’ చేర్చారని గుర్తుచేశారు. ఇది తనకు చాలా శక్తినిచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి ఎన్డీయేకు విజయం కట్టబెట్టారన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలంటూ అధికారం అప్పగించారని తెలిపారు. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటిచెప్పినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక మోడీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఇమేజ్లను కూడా మార్చారు. నూతన మంత్రివర్గంతో దిగిన ఫొటోను కవర్ ఇమేజ్గా ఉంచారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం ‘ఎక్స్’ అకౌంట్లో ఇదే విధమైన మార్పులు చేపట్టింది. రాజ్యాంగానికి మోడీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోన్న ఫొటోను కవర్ ఇమేజ్గా ఉంచారు.
ఇది కూడా చదవండి: Yemen: యెమెన్లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి
తాజావార్తలు
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!