పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంపై ఆ జట్టు ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్.. అయ్యర్ కెప్టెన్సీపై స్పందించాడు. జట్టులో ప్రతి ఒక్కరి పాత్రపై స్పష్టత ఇచ్చిన విధానం, ఆటగాళ్లకు అందిస్తున్న మద్దతు అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని పేర్కొన్నాడు. తన సక్సెస్కు కారణం శ్రేయాస్ అని చెప్పాడు. టెన్షన్ వద్దని, స్వేచ్ఛగా ఆడమని తనకు చెప్పాడని ప్రభ్సిమ్రన్ చెప్పుకొచ్చాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ మాట్లాడుతూ… ‘2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా…
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు అద్భుత ఆరంభం దక్కింది. ఇప్ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలవగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ విజయానికి ప్రధాన కారణం ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ జోడీ. ఈ జోడీ మధ్య ఉన్న అద్భుత అండర్స్టాండింగ్, ఆటతీరు జట్టుకు బలంగా మారింది. ఐపీఎల్ 2025లోనే వీరిద్దరూ కలిసి 532 పరుగులు సాధించి ఓపెనింగ్లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2026 సీజన్లో కూడా అదే జోష్…
Shreyas Iyer Captaincy Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్సీ అనేది ఒక కళ. మెగా లీగ్లో అద్భుత జట్టును విజయవంతంగా నడిపించడం సాధారణ విషయమే. అయితే సాధారణ స్థాయిలో ఉన్న జట్టును ప్లేఆఫ్స్, ఫైనల్స్ వరకు తీసుకెళ్లడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అతడి కెప్టెన్సీ రికార్డులు చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఎంత ప్రభావం చూపాడో ఇట్టే…
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేరింది. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు. ఇప్పటివరకు యూజీ మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడినా.. ట్రోఫీ మాత్రం అందుకోలేదు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నా.. ఐపీఎల్ టైటిల్ మాత్రం చహల్ ఖాతాలో లేదు. దాంతో మూడు ఫైనల్స్ ఆడినా.. కప్ గెలవని తొలి ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు. Also…
IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ముగింపు వేడుకలు ఈ రోజు (జూన్ 3న) సాయంత్రం 6:00 గంటలకు స్టార్ట్ కానున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతుంది.
ఐపీఎల్ ఫైనల్……. ఇంకా కొన్ని గంటల్లో ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. మొదటి క్వాలిఫయర్ లో గెలిచి ఆర్సీబీ ఫైనల్ ల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దే కీలక పాత్ర. మ్యాచ్ ఓటమి అంచున ఉండగా, అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో ముంబైకి చుక్కలు చూపించాడు. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అయ్యర్…
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్- 2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య ప్రశంసించాడు. శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరుగులు చేశాడన్నాడు. తమ బ్యాటర్లు మంచి స్కోరే చేశారని, బౌలింగ్ యూనిట్ రాణించలేకపోయిందన్నాడు. తమ బౌలర్లు సరైన లెంగ్త్ బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సరైన సమయాల్లో జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించుకోలేకపోయాం అని హార్దిక్ తెలిపాడు. క్వాలిఫయర్-…
ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి 207 పరుగులు చేసి.. ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం జరిగే ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు. అహ్మదాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. దాంతో శ్రేయస్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరింది. ఈ ఘనత దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వల్ల కూడా కాలే. అయితే ఈ ఇద్దరు…
భారీ మ్యాచులంటే తనకు చాలా ఇష్టం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్గా ఉండటం వెనుక కారణం ఏమీ లేదని చెప్పాడు. నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని తన జట్టు సహచరులకు ఎప్పుడూ చెబుతుంటా అని పేరొకొన్నాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదంతా అక్కడితోనే మరిచిపోయాం అని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన పంజాబ్..…