ఈరోజు హైదరాబాద్ లో “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ జరిగింది. అయితే సినిమా చిత్రీకరణ సమయం నుంచి నిన్న మూవీ రిలీజ్ అయ్యే వరకు త్రివిక్రమ్ దర్శకుడు సాగర్ కే చంద్రకు ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్ చైర్ లో కూర్చున్నారని, అంతా ఆయన చేతిలోనే ఉందని రూమర్స్ వచ్చాయి. పైగా త్రివిక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అసలు మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా జరిగిన “భీమ్లా నాయక్”…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంయుక్త మీనన్, నిత్యామీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించగా, తమన్ సంగీతం సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్’కు ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా మేకర్స్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.…
ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘భీమ్లా నాయక్’ మేనియా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో థియేటర్ లో ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రదర్శితం అవుతుండగా, తమన్ స్టేజి పై ఎక్కి ‘లాలా…
ఇప్పుడు టాలీవుడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం ఇంకా థియేటర్లు, టికెట్ రేట్లపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే “భీమ్లా నాయక్” విడుదలకు ముందే సవరించిన టిక్కెట్ ధర GOను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని అంతా భావించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అక్కడ టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. నిన్న ‘భీమ్లా నాయక్’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీకి మొదటి ఆట నుండే ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ కె చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ ఎ. ఎస్. ప్రకాశ్, చిత్ర నాయిక సంయుక్త మీనన్…
జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను జిల్లా సమీక్ష సమావేసంలో చర్చించామని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాడు-నేడు, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పథకం, హోసింగ్ తదితరుల అంశాలు పై చర్చించామని ఆయన వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటిని క్లియర్ చేయమని అధికారులను అదేశించామని, భీమ్లా నాయక్ సినిమా టికెట్స్ విషయంపై స్పందిస్తూ మనం ఒక వ్యవస్థలో ఉన్నామని ఆయన అన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, వ్యక్తుల కోసం కాదు ..ప్రజల…
ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లతో థియేటర్లను నిర్వహించలేమంటూ కొంతమంది ఎగ్జిబిటర్స్ వాటిని మూసివేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాను సైతం వారు ప్రదర్శించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే… ఈ విషయంలో గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందనే వాదన వినిపిస్తోంది. ‘అత్యధిక రేట్లకు టిక్కెట్స్ ను అమ్ముకోనిస్తేనే థియేటర్లను నడుపుతాం తప్పితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు నడపమని ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టే దీనిని అర్థం చేసుకోవాలని కొందరంటున్నారు. నిజం చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాను…
హీరోయిన్ పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. థియేటర్లలో అభిమానులు చేస్తున్న రచ్చకు…
‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీకి త్రివిక్రమ్ కంట్రిబ్యూషన్ ఏమిటనేది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే ‘భీమ్లా నాయక్’ మూవీనే లేదని దర్శకుడు సాగర్ కె చంద్ర తెలిపాడు. మాటల రచయిత నుండి దర్శకుడిగా మారినా త్రివిక్రమ్ కలం పదను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది ‘భీమ్లానాయక్’ మూవీ. అంతేకాదు… స్క్రీన్ ప్లే విషయంలోనూ త్రివిక్రమ్ సత్తాను ఇంకోసారి చాటింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ…