పవన్ కళ్యాణ్ తన పాతికేళ్ళ కెరీర్ లో ఇప్పటి దాకా నటించిన చిత్రాలు పట్టుమని పాతికే! అందులో పవన్ కు, ఆయన ఫ్యాన్స్ కు ఆనందం పంచిన చిత్రాలు రీమేక్స్ కావడం గమనార్హం! ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’గా వస్తున్నాడు. ఈ సినిమా మళయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్! దాంతో పవన్ ఫ్యాన్స్ లో ఆనందం చిందులు వేస్తోంది. Read Also : Bheemla Nayak : ఫ్యాన్స్ విరాళాలు! పవన్ 1996లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందుకు వస్తోందని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో సంబరం మొదలయింది. ఈ సినిమా రిలీజ్ నాటికి ఏపీ గవర్నమెంట్ ప్రదర్శన ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, ఎప్పటిలాగే పరిమిత ప్రదర్శనలు, మునుపటి రేట్లతోనే సాగాలని ప్రభుత్వం ఆదేశించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ పలు రికార్డులు బద్దలు చేస్తుందని, నిర్మాతలకు, కొనుగోలుదారులకు…
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఈ మూవీ టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఐదు షోస్ వేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదనపు ఆటలు వేయడాన్ని, టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడాన్ని ఎంత మాత్రం సహించమని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై తెలుగు…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు…
సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుపోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని బుధవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్లోకి వెళ్లి “భీమ్లా నాయక్” టీమ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, దర్శకుడు సాగర్…
పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ తాజాగా ఆర్జీవీని టార్గెట్ చేసింది. పైగా మరో డైరెక్టర్ నూ ఇన్వాల్వ్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. “పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ గా మారితే ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ గా మారాయి” అంటూ మొదలెట్టిన పూనమ్ ఆర్జీవీ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ సమాధానం ఇచ్చింది. ఆర్జీవీ నిన్న రాత్రి జరిగిన “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి “గాడ్ ఫాదర్” షూటింగ్లో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “భీమ్లా నాయక్” సెట్ను సందర్శించి, తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. చాలా రోజుల నుంచి టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తుంటే, ఈరోజు జరగనున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున సన్నాహాలు…