Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు…
సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కౌంటర్కు దిగారు.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా సంతోషించాం.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి, 5 స్థలం, ఉద్యోగం ఇచ్చారు.. అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.. నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. అయినా, నేను డబ్బుకోసం పోరాటం…
విశాఖ వేదికగా 'సేనతో సేనాని' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..
రుషికొండ టూరిజం రిసార్ట్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోల బాలవీరంజనేయస్వామి సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయింది. టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయంతో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి టూరిజం శాఖకు సంబంధించి కొంతమంది అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: Pawan Kalyan: 21 ఏళ్ల వయసులోనే రాజకీయ ఆలోచనలు వచ్చాయి..…
Pawan Kalyan Said I felt happy about losing the 2019 elections: తాను 21 సంవత్సరాల వయసులోనే రాజకీయ ఆలోచనలు మొదలుపెట్టాను అని, అప్పుడే కమ్యూనిజం చదివాను అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఫీల్ అయ్యాను అని, ఆ భగవంతుడు కష్టాలు ఎలా ఉంటాయో తనకు చూపించాడన్నారు. ఏ పని ఎందుకు చేస్తానో తన కారణాలు తనకు ఉంటాయని, కొన్ని కఠినమైన…
తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా.. జనసేన పార్టీ కూడా సుగాలి ప్రీతి కేసుపై స్పందించింది.. సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో... సాయం పొందిన వారు…
విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను పరిశీలించారు.. జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్ను తిలకించారు పవన్.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది" అంటారు.. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Pawan Kalyan Meets MLAs in Vizag: విశాఖలో జరుగుతున్న ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిదేశం చేశారు. పార్టీ కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి…