AP Housing Scheme: గుడ్న్యూస్.. ఉగాది రోజున 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు..
- పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ..
- గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారాలపై నిరంతరం ఆరా..
- ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు..
- సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నేర నియంత్రణ ప్రణాళిక..
- రియల్ టైమ్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Housing Scheme: ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్దిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు అందించేలా అధికారిక లేఖ వెళ్లేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సీఎం సూచించారు. ఇటీవల ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారం అయ్యేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎం లాంటి సంస్థలు ముందుకు వచ్చాయని వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. అటు కాలిబో సంస్థ ఏర్పాటు చేయదలచిన ఏఐ శాండ్ బాక్స్ వచ్చే నాలుగు నెలల్లో స్టార్టప్ ల కోసం అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఎన్విడియా సంస్థ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో భాగసామ్యం వహించేలా చూడాలని ఆయన ఆదేశించారు.
Read Also: CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
రాష్ట్రంలో ప్రతీ రైతుకూ సహకారం అందించేలా ఏఐ ఆగ్రానమిస్ట్, విద్యా బోధనకు సహకారం అందించేలా ఏఐ ట్యూటర్, ప్రాథమికంగా వైద్య సలహాలు అందించేలా ఏఐ డాక్టర్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పేషెంట్ ప్రిస్క్రిప్షన్ కూడా యాప్ ద్వారా వచ్చేలా చూడాలన్నారు. సీసీ టీవీ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 14 వేల సీసీ కెమెరాలను అనుసంధానించి నేర నియంత్రణ చేపట్టేలా చూడాలన్నారు. నేరస్థులను గుర్తించి నేరాలకు అడ్డుకట్టే వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరితగతిన అందుబాటులోకి తేవటంతో పాటు డ్రోన్ ప్లైయింగ్ ట్రాక్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహకారంతో అత్యుత్తమ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏటీసీ తరహాలోనే డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను కూడా రూపొందించాలన్నారు. వాట్సప్ గవర్నెన్సు వినియోగం మరింత పెంచేలా పౌరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఈ సమీక్షకు మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్, గనులు, విద్య, ఆర్ధిక, ప్రణాళిక శాఖల అధికారులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..