Krish: హరిహర వీరమల్లు విషయంలో బాధగా ఉంది
- 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం వివరించిన డైరెక్టర్ క్రిష్
- షెడ్యూలింగ్ సమస్యలు, ఆర్థిక కారణాల వల్లే సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపిన క్రిష్
- 'పవన్ కళ్యాణ్' పై తనకున్న గౌరవాన్ని చాటుకున్న క్రిష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, “మీరు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడానికి కారణమేంటి? మీరు దర్శకుడుగా తప్పుకోవడానికి కారణమేంటి?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన స్పందించారు.
Also Read : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం
Also Read
“అనుకోని పరిస్థితుల వల్లే నేను చేసిన సినిమా ఆలస్యమైంది. మాకు అన్ని కథలు కంచికి చేర్చాలి అనే కోరిక ఉంటుంది, కానీ కొన్ని కథలు ముగించలేం. హరిహర వీరమల్లుకు అలాగే జరిగింది. ఆ విషయంలో నాకు బాధగా ఉంది. మాకు ఏ.ఎం. రత్నం గారంటే అపారమైన గౌరవం. ఆయన ఒక విజనరీ ఫిలిం మేకర్. ఇప్పుడు మనం పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నాం, దానికి ఒక మెట్టు వేసింది రత్నం గారు. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. ఒక మనిషిగా చాలా గౌరవం, ఒక నాయకుడిగా అత్యంత గౌరవం, ఒక నటుడిగా గౌరవం ఉంది. కానీ షెడ్యూలింగ్స్ కారణంగా ఆ సినిమా ఎప్పుడు ముందుకు వెళుతుందో తెలియలేదు. ఒకానొక సందర్భానికి వచ్చాక, ఐదేళ్ల ప్రయాణంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. మా టీం మొత్తాన్ని మెయింటైన్ చేయాలి, కానీ అలా చేయలేక నెక్స్ట్ సినిమాకి ఫార్వర్డ్ అవ్వాల్సి వచ్చింది. నాకు కుదరలేదు, అందుకే వేరే ప్రాజెక్టుకి వచ్చాను,” అని క్రిష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!