Krish: హరిహర వీరమల్లు విషయంలో బాధగా ఉంది
- 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం వివరించిన డైరెక్టర్ క్రిష్
- షెడ్యూలింగ్ సమస్యలు, ఆర్థిక కారణాల వల్లే సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపిన క్రిష్
- 'పవన్ కళ్యాణ్' పై తనకున్న గౌరవాన్ని చాటుకున్న క్రిష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, “మీరు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడానికి కారణమేంటి? మీరు దర్శకుడుగా తప్పుకోవడానికి కారణమేంటి?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన స్పందించారు.
Also Read : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
“అనుకోని పరిస్థితుల వల్లే నేను చేసిన సినిమా ఆలస్యమైంది. మాకు అన్ని కథలు కంచికి చేర్చాలి అనే కోరిక ఉంటుంది, కానీ కొన్ని కథలు ముగించలేం. హరిహర వీరమల్లుకు అలాగే జరిగింది. ఆ విషయంలో నాకు బాధగా ఉంది. మాకు ఏ.ఎం. రత్నం గారంటే అపారమైన గౌరవం. ఆయన ఒక విజనరీ ఫిలిం మేకర్. ఇప్పుడు మనం పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నాం, దానికి ఒక మెట్టు వేసింది రత్నం గారు. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. ఒక మనిషిగా చాలా గౌరవం, ఒక నాయకుడిగా అత్యంత గౌరవం, ఒక నటుడిగా గౌరవం ఉంది. కానీ షెడ్యూలింగ్స్ కారణంగా ఆ సినిమా ఎప్పుడు ముందుకు వెళుతుందో తెలియలేదు. ఒకానొక సందర్భానికి వచ్చాక, ఐదేళ్ల ప్రయాణంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. మా టీం మొత్తాన్ని మెయింటైన్ చేయాలి, కానీ అలా చేయలేక నెక్స్ట్ సినిమాకి ఫార్వర్డ్ అవ్వాల్సి వచ్చింది. నాకు కుదరలేదు, అందుకే వేరే ప్రాజెక్టుకి వచ్చాను,” అని క్రిష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..