Lashkar-e-Taiba: పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు సిద్ధమైంది. డిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్లోని ఒక ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ మత ప్రదేశాల సమీపంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తుందని భద్రతా సంస్థల నిఘా వెల్లడించింది. ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి పరుగులు పెడుతుంటే పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తోందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్లో పేదరికం 6 సంవత్సరాల్లో 7 శాతం పెరిగినట్లుగా తాజా సర్వేలను బట్టి వెల్లడవుతోంది.
T20 World Cup: భారతదేశానికి వ్యతిరేకంగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ(ICC) ఒప్పుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్( T20 World Cup 2026) నుంచి బయటకు వెళ్లింది. అయితే, అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది.
Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని…
Mohammad Yousuf: టీ20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఆ దేశంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అభిమానులు, పాక్ మాజీలు పాక్ టీమ్పై, ప్లేయర్ల ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ స్టార్ ఆటగాడిగా భావించే బాబర్ అజమ్పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు.
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్,…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్ కంటిచూపు 80 శాతం కోల్పోయినట్లు నివేదిక వెలువడటంతో బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలను కలిపే కీలక మార్గాలను అడ్డుకున్నారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయనకు కనీస చికిత్స కూడా పాక్ ప్రభుత్వం అందించడం లేదనే ఆరోపణ వస్తున్నాయి. మాజీ పాక్ కెప్టెన్ తన కుడి కంటిచూపును 80 శాతం కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు తీవ్ర అవమానం ఎదురైంది. జర్మనీలో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కు హాజరైన ఆయనను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. సమావేశానికి వెళ్తున్న అసిమ్ మునీర్ను అక్కడి సెక్యూరిటీ ఆపేసింది. ఐడీ కార్డ్ చూపించాలని కోరింది.