పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసినందుకు తమను పోలీసులు క్రూరంగా అణిచివేసినట్లు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ – నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్లు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాల జైలు వెలుపల, ఆయన పార్టీ మద్దతుదారులతో…
Pakistani Couple: పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట, భారత సరిహద్దు దాటి బీఎస్ఎఫ్కు పట్టుబడింది. పాకిస్తానీ వ్యక్తి, అతడి ప్రేమికురాలు ఇంటి నుంచి పారిపోయి కాలినడకన గుజరాత్లోని కచ్ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Pakistan-Bangladesh: గతేడాది హింసాత్మక విద్యార్థి అల్లర్ల తర్వాత, షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఈయన హయాంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం చిగురిస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లుగా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు.
బాంబు దాడులతో పాకిస్థాన్ దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున పెషావర్లోని పాకిస్థాన్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్పై వైమానికి దాడికి తెగబడింది.
Pakistan: పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం దాదాపుగా కనుమరుగైనట్లే. పాకిస్తాన్లో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యం ఉన్నట్లు బయటకు కనిపించినప్పటికీ, సైన్యం తెర వెనుక నుంచి ఆడించేది.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్తో టూ-ఫ్రంట్ వార్కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.