Israel-Khamenei: ఖమేనీ హత్య వెనుక ఇంత జరిగిందా? వెలుగులోకి సంచలన రిపోర్ట్
- ఖమేనీ హత్యపై సంచలన రిపోర్ట్
- వెలుగులోకి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నతమైన హోదాలో ఉన్న నాయకుడు. ప్రపంచంలో గుర్తింపు ఉన్న నేత. అలాంటి నాయకుడిని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంతమొందించాయి. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ఒక నాయకుడిని గుట్టుచప్పుడు లేకుండా లేపేయడంతో ప్రపంచమంతా కలవరానికి గురి చేసింది. తాజాగా మర్డర్ వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 90 రోజుల క్రితమే ఖమేనీని చంపేయాలని ప్రణాళిక రచించినట్లుగా తెలిపారు. 2025 నవంబర్లో అంతమొందించాలని ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. కానీ అప్పుడు కుదరలేదని.. జనవరిలోనైనా అమలు చేయాలనుకున్నామని.. అంతలోనే ఇరాన్లో అల్లర్లు మొదలయ్యాయని.. ఈ గందరగోళం మధ్య ప్లాన్ వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్యలో ప్లాన్ అమలు చేయాలని ఆలోచన చేస్తుండగా ఫిబ్రవరి 28న అత్యవసరంగా ప్లాన్ అమలు చేయాల్సి వచ్చిందని వివరించారు.
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన చాలా చిన్న, రహస్యమైన సమావేశంలో అత్యంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి చివరిలో అమెరికాతో కలిసి మొదటి గంటల్లోనే ఖమేనీని అంతమొందించినట్లుగా చెప్పారు. ఖమేనీని చంపేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టి్క్ క్షిపణులు ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు కలిగిస్తాయని ఇజ్రాయెల్ భావించిందని.. అందుకే ఖమేనీని చంపడమే తమ ముందన్న లక్ష్యంగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ను పూర్తిగా నాశనం చేయగల ఆయుధాలను ఇరాన్ అభివృద్ధి చేసిందని.. అందుకే దాని మూలల నుంచే తొలగించాలని భావించినట్లుగా చెప్పారు.
ఇరాన్లో పాలన మార్పును ఇజ్రాయెల్ కోరుకుంటోందని.. ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవాలన్నారు. కొత్తగా శాంతియుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇరాన్ ఎన్నుకునే నాయకుడు.. ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటాడని.. ఇజ్రాయెల్ను నాశనం చేసే ఏ నాయకుడిని సహించబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ ఇంకా అధికారాన్ని వదులుకోలేదని.. పైగా ఎదురుదాడికి దిగుతోందన్నారు. దీంతో చమురు సరఫరాలకు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయన్నారు. ఇరాన్ ముప్పు తొలగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?